E-Paper
Advertisement

Operation Sindoor : చచ్చాడు చెత్త వెదవ.. మసూద్ అజార్ సోదరుడు హతం..

Operation Sindoor : చచ్చాడు చెత్త వెదవ.. మసూద్ అజార్ సోదరుడు హతం..
Advertisement

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌‌ నెక్స్ట్‌ లెవల్‌కు చేరింది. ఏకంగా పాకిస్తాన్ ప్రధాన నగరాలనే డ్రోన్లతో దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ. లాహోర్‌, రావల్పిండిలను పిండిపిండి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. ఇండియాపై పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది. అన్ని అంశాల్లో దాయాదిపై అప్పర్ హ్యాండ్ మనదే. ఇదే సమయంలో మరో గుడ్ న్యూస్ కూడా తెలిసింది. ఉగ్ర స్థావరాలపై జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ కీలక నేత, కాందహార్ విమాన హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు. ఆ నరరూప రాక్షసుడిని లేపేయడం.. ఇండియన్ ఆర్మీ సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి.

రవూఫ్ అజహార్ హతం

Advertisement

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. బహావల్‌పుర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ కాంప్లెక్‌పై భారత్‌ అటాక్ చేసింది. ఆ దాడిలో జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు 14 మరణించారు. వీరిలో మసూద్ సోదరుడు రవూఫ్‌ అజహర్‌ కూడా ఉన్నట్టు నిర్ధారణైంది. ఈ దాడిలో అజహర్‌ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు.

వాడెంత కిరాతకుడంటే..

Advertisement

1999లో జరిగిన విమానం హైజాక్‌లో రవూఫ్‌ అజహర్‌ హస్తం ఉంది. ఐదుగురు పాక్‌ ఉగ్రవాదులు నేపాల్‌లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్‌కు తీసుకెళ్లారు. భారత జైళ్లలో ఉన్న మసూద్‌ అజహర్‌, అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌, ముస్తాక్‌ అహ్మద్‌ జర్గర్‌ అనే కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేస్తేనే.. విమాన ప్యాసింజర్లను రిలీజ్ చేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఉగ్రవాద డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం.. ఆ ముగ్గురు టెర్రరిస్టులను వాళ్లకు అప్పగించింది. వారిలో ఒకడే మసూద్ అజార్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించింది అతనే. అన్న కోసం విమానాన్ని హైజాక్ చేసింది అతని తమ్ముడు రవూఫ్ అజహర్. ఆనాటి నుంచి పాకిస్తాన్‌లో మకాం వేసి.. ఉగ్రవాదులను తయారు చేస్తూ.. కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తున్నారు ఆ సోదరులు. 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌ కోట్‌ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్‌ వంటి ఉగ్ర ఘటనల్లో వాళ్ల ప్రమేయం ఉంది. రవూఫ్ ప్రస్తుతం జైషే మహ్మద్ సంస్థలో కీలక కమాండర్‌గా ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహవల్‌పూర్‌లో జరిగిన బాంబింగ్‌లో అతడు హతమయ్యాడు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×