BigTV English
Advertisement

Pappu yadav crying: పప్పుయాదవ్ కంటతడి.. ఏమైంది?

Pappu yadav crying: పప్పుయాదవ్ కంటతడి.. ఏమైంది?

pappu yadav crying on purnea seat issue


Pappu yadav crying: బీహార్ రాజకీయాలు అనగానే ముందుగా పప్పుయాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ గుర్తుకొస్తారు. టికెట్ రాలేదన్న కారణంగా చిన్నపిల్లాడి మాదిరిగా కంటతడి పెట్టారు. పట్టరాని కోపంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌తోపాటు తేజస్వీపై విమర్శలు గుప్పించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని పూర్నియా నుంచి పోటీ చేయాలని పప్పుయాదవ్ ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆర్జేడీ అధినేత లాలూ, తేజస్వీతో చర్చలు జరిపారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కూడా. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా పూర్నియా సీటు ఆర్జేడీకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ పార్టీకి చెందిన భీమా భారతి నామినేషన్ దాఖలు చేశారు.


దీనిపై పప్పుయాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు పదేపదే టికెట్‌ను నిరాకరిస్తున్నారని, తనకేం తక్కువంటూ మండిపడ్డారు. తాను ఏడాదిగా పూర్నియా కోసం పని చేశానని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు ఖరారయ్యారని బీహార్ కాంగ్రెస్ తెలిపింది. పప్పుయాదవ్ తమకు పోటీదారుడు కాదని, ఆయన మద్దతు ఆర్జేడీ అభ్యర్థికేనని తెలిపారు.

బీహార్‌‌‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు పప్పూయాదవ్. కాకపోతే తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేకసార్లు పని చేశారు. 1980ల్లో జనతాదళ్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన పప్పూయాదవ్, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆర్జేడీ తరపున చట్ట సభల్లో అడుగుపెట్టారు. కానీ మారుతున్న రాజకీయాలకు పప్పూయాదవ్‌కు మొండిచేయి మిగిలింది.

Tags

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×