BigTV English

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: పార్ల‌మెంట్ శీతాకాల‌ స‌మావేశాలు నిన్న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఈరోజు రెండో రోజు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ ముందు భార‌తీయ వాయుయాన్ విధేయ‌క్ బిల్లును ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఈ బిల్లును కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అంతే కాకుండా అదానీ కేసు, మ‌ణిపూర్ అల్ల‌ర్ల అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించాల‌ని విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న అదానీ లంచం ఆరోప‌ణ‌లపై చ‌ర్చ జ‌ర‌పాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేశారు.


Also read: తాజ్ హోటల్‌లో.. ఎంపీలకు దావత్ ఇస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం

రాజ్య స‌భ‌, లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు. కానీ లోక్ స‌భ స్పీక‌ర్, రాజ్య‌స‌భ చైర్మ‌న్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో విప‌క్ష ఎంపీలు సైతం త‌గ్గేదే లే అన్నారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. స‌భ‌ను నేటికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇవాళ కూడా అదానీ లంచం ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్ల సమావేశం అయ్యారు. పార్లమెంట్‌ భవన్‌లో కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్లు భేటీ అయ్యారు.


అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు. ఇదిలా ఉంటే అదానీ లంచం వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ప్ర‌ధాని మోడీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మోడీ ప్రాజెక్టుల‌న్నీ అదానీకి క‌ట్ట‌బెట్టి ఆయ‌న‌ను కుభేరుడిని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అర్హ‌త లేకున్నా అదానీ కంపెనీల‌కు రుణాలు ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో అమెరికాలో లంచం కేసులో అదానీ అరెస్ట్ అయితే మోడీ రాజీనామా చేయాల‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Big Stories

×