E-Paper
Advertisement

రైతులు, కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా?

రైతులు, కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా?
Advertisement

PM Maandhan Yojana: రైతులు, అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన. ఈ పథకానికి ఎవరు అర్హులు? రిజిస్ట్రేషన్ ఎలా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా ప్రతినెలా రూ.3 వేల చొప్పున పెన్షన్​ పొందవచ్చు. ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛన్ ప్రయోజనాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, కార్మికులు పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాల కింద పెన్షన్ అందిస్తుంది.

అర్హతలు

  • 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న కార్మికులు, రైతులు అర్హులు
  • భూ రికార్డుల్లో పేరు ఉండి, 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉండాలి.
  • నెల జీతం రూ.15 వేల లోపు ఉన్న అసంఘటిత రంగ కార్మికులు
  • ఈపీఎఫ్‌వో, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌, ఈఎస్‌ఐ, ఇతర సామాజిక భద్రత పథకాల్లో లేని వారు అర్హులు

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్

ఆధార్ కార్డు, ఇ-శ్రమ్ కార్డు, మొబైల్ నెంబర్, నామినీ ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, సాగు భూమి వివరాలు, వయసు నిర్థారణ పత్రాలు, బ్యాంకు పాస్ బుక్

దరఖాస్తు విధానం

Advertisement

ఈ స్కీమ్ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లాలి. అక్కడ ఆపరేటర్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు కూడా మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్​ నింపాల్సి ఉంటుంది. ఫారమ్ పూర్తిచేస్తే CSC ఆపరేటర్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ వివరాలన్నీ కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేస్తారు.

ప్రీమియం వివరాలు

ఈ స్కీమ్ లో చేరిన వారు వయసు ప్రకారం ప్రతి నెలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాలి. 18 ఏళ్లు ఉన్న వారు తన వాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే.. కేంద్రం రూ.55 చెల్లిస్తుంది. వయసును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అర్హులైన సభ్యులు 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న వారు మరణిస్తే.. నామినీకి పెన్షన్ మొత్తంలో సగం అంటే.. రూ.1500 ప్రతి నెలా చెల్లిస్తారు.

Advertisement

Also Read :  ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×