PM Modi Pays Tribute to Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి రోజు ఇది. ఆయన 33వ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ మేరకు X వేదికగా ఆయన.. “మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని వీర్ భూమిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. పి. చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఢిల్లీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.
1984లో రాజీవ్ గాంధీ తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. 1984లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. 40 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశ ప్రధానమంత్రి అయ్యారు. డిసెంబర్ 2 1989 వరకూ భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 1944 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆత్మాహుతి బాంబర్ తో హత్య చేయబడ్డారు.
Also Read: Kharge comments on PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..
On his death anniversary, my tributes to our former PM Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) May 21, 2024