E-Paper
Advertisement

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!
Advertisement

PM Modi Pays Tribute to Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి రోజు ఇది. ఆయన 33వ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ మేరకు X వేదికగా ఆయన.. “మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఢిల్లీలోని వీర్ భూమిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. పి. చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఢిల్లీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

Advertisement

1984లో రాజీవ్ గాంధీ తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. 1984లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. 40 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశ ప్రధానమంత్రి అయ్యారు. డిసెంబర్ 2 1989 వరకూ భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 1944 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆత్మాహుతి బాంబర్ తో హత్య చేయబడ్డారు.

Also Read: Kharge comments on PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×