E-Paper
Advertisement

అమిత్ షా ప్రసంగం అద్భుతం.. నక్సలిజం నిర్మూలనలో మా విజయం ఇది: ప్రధాని మోదీ

అమిత్ షా ప్రసంగం అద్భుతం.. నక్సలిజం నిర్మూలనలో మా విజయం ఇది: ప్రధాని మోదీ
Advertisement

PM Modi Amit Shah Naxal Free India: భారతదేశం నుండి వామపక్ష అతివాదాన్ని సమూలంగా తుడిచిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజంపై చేసిన ప్రసంగాన్ని అద్భుతమైనదిగా ప్రధాని అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం చేసిన కృషిని అమిత్ షా కళ్లకు కట్టినట్లు వివరించార‌ని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన మావోయిస్టు భావజాలం అనేక ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుందని, లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సలిజం బారిన పడిన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు చేరడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కేవలం ఆయుధాలతోనే కాకుండా, సుపరిపాలన మరియు అభివృద్ధి ద్వారా నక్సలిజాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య సదుపాయాలను మారుమూల అడవుల్లోకి తీసుకెళ్లడం ద్వారా అందరికీ శాంతి, శ్రేయస్సును అందించడంపై దృష్టి సారించామని వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారని, ఇది దేశ సమగ్రతకు శుభపరిణామమని మోదీ పేర్కొన్నారు.

Advertisement

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా నక్సలిజం నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. మావోయిస్టుల పొలిట్‌బ్యూరో, వారి కేంద్ర వ్యవస్థను దాదాపు తుడిచిపెట్టేశామని, దీంతో దేశం నక్సల్స్ ముప్పు నుండి విముక్తి పొందిందని ప్రకటించారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో కూడా నక్సలిజం అంతమైందని చెప్పారు. “ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతాన్ని సాధించడమే మా లక్ష్యం. ఈ ప్రక్రియ అధికారికంగా పూర్తయిన తర్వాత దేశానికి అధికారికంగా తెలియజేస్తాం. అయితే, ప్రస్తుతం మన దేశం నక్సల్ రహితంగా మారిందని నేను ధీమాగా చెప్పగలను” అని అమిత్ షా ఉద్ఘాటించారు.

మావోయిస్టుల సుదీర్ఘ హింసాకాండను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని, అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజలను ఓటు వేయకుండా నిరోధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ నక్సల్ సానుభూతిపరులతో కలిసి బహిరంగంగా పలుమార్లు కనిపించారని, తన సోషల్ మీడియా ఖాతా నుండి మావోయిస్టులకు సానుభూతి తెలిపే వీడియోలను కూడా పోస్ట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ ఆదివాసీల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement

Read Also: అప్పుడు మోదీ సభకు వెళ్లిన గద్దర్ గుర్తులేరా? అమిత్ షాపై భువనగిరి ఎంపీ ఫైర్

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×