E-Paper
Advertisement

అప్పుడు మోదీ సభకు వెళ్లిన గద్దర్ గుర్తులేరా? అమిత్ షాపై భువనగిరి ఎంపీ ఫైర్

అప్పుడు మోదీ సభకు వెళ్లిన గద్దర్ గుర్తులేరా? అమిత్ షాపై భువనగిరి ఎంపీ ఫైర్
Advertisement

Chamala Kiran Kumar Reddy: దివంగత ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో తీసుకురావడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెబుతూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను టార్గెట్ చేయడమే ఏకైక అజెండాగా అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న భారీ ఆదరణను చూసి అమిత్ షా తట్టుకోలేకపోతున్నారని చామల ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే రాహుల్ గాంధీపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. “మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మారుస్తామని అమిత్ షా చెప్పారు.. మీ అజెండా ప్రకారం మీరు నక్సలిజాన్ని అంతమొందించుకోండి, దాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ ఆ సాకుతో కాంగ్రెస్ పార్టీ చరిత్రను బద్నాం చేయాలని చూడటం దారుణం” అని హితవు పలికారు.

Advertisement

ప్రజా గాయకుడు గద్దర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చామల తీవ్రంగా ఖండించారు. గద్దర్ తన మావోయిస్టు సిద్ధాంతానికి ఎప్పుడో స్వస్తి పలికి, తెలంగాణ సంస్కృతి, చరిత్ర మరియు సంప్రదాయాల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే అమిత్ షాకు వచ్చిన నొప్పి ఏంటని ప్రశ్నించారు. జూలై 20, 2022న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పాల్గొన్న సభకు గద్దర్ హాజరైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు. “అమిత్ షా సభకే హాజరైన గద్దర్ తో రాహుల్ గాంధీ స్టేజ్ పంచుకుంటే అది అపరాధం ఎలా అవుతుంది?” అని నిలదీశారు.

లోక్ సభలో గద్దర్ గురించి అమిత్ షా తప్పుగా మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఎందుకు నోరు మెదపలేదని చామల ప్రశ్నించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గద్దర్ స్వయంగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసుల గురించి చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకపక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెబుతూనే, మరోపక్క సిద్ధాంతాన్ని వదిలేసి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చిన గద్దర్ వంటి వారిని కించపరచడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.

Advertisement

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని చామల ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ ను విమర్శించడం అంటే తెలంగాణ ప్రజలను విమర్శించడమేనని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: అప్పులు పెరిగాయి.. ఆస్తులు కరగలేదు.. కాగ్ రిపోర్టుతో కళ్లు తెరవాలన్న హ‌రీష్ రావు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×