E-Paper
Advertisement

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం..  లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం
Advertisement

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకని అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు.  

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు

Advertisement

వందేమాతరం గేయంపై సోమవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర  సంగ్రామం ఫలితంగానే మనమందరం ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గేయం, వందేమాతరం అని అన్నారు.

ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందన్నారు. దేశం మొత్తం వందేమాతర గీతం స్ఫూర్తితో ఏకమైందన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని సంకల్పించారని గుర్తు చేశారు ప్రధాని. వందేమాతరం.. రాజకీయ అధికారం కోసం ఉద్దేశించిన గీతం కాదన్నారు.

Advertisement

లోక్‌సభలో చర్చ ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరాన్ని తొక్కిపట్టారని వివరించారు. గంగా , సింధూ, గోదావరి, కావేరి నదుల వెంట ఉన్న సాంస్కృతిక వైభవాన్ని వందేమాతరం చాటి చెప్పిందన్నారు. జననీ జన్మభూమశ్చ అన్న రాముడి మాటలకు మరో రూపం వందేమాతరం అని తెలిపారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన ఈ గేయంపై చర్చ జరపడం మనందరి అదృష్టమన్నారు. ఈ మధ్యే మన రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. 2047 నాటిని భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సంకల్పించామన్నారు.

1857 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులపై ఒత్తిడి పెంచారన్నారు ప్రధాని మోదీ. ఎంత ఒత్తిడి పెరిగినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గేయాన్ని రచించారన్నారు. ఈ నినాదం బ్రిటీషర్లకు సింహ స్వప్నంగా మారిందన్నారు. భారత్ నలువైపులా వందేమాతర నినాదం మారుమోగిందన్నారు. ఈ గేయం ఆజాద్‌కు విజన్‌గా మారిందన్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు బయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి

పాలనలో భారతీయుల శక్తి సామర్థ్యాలపై సందేహం వెలిబుచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కవితలు చదివి వినిపించారు. దేశ ఐక్యతకు చిహ్నంగా వందేమాతరం నిలిచిందన్నారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నాలు చేశారన్నారు. దేశం ముక్కలు కాకుండా ఈ గేయం సాయం చేసిందన్నారు.

 బెంగాల్ ఐక్యతకు వందేమాతర గేయం పాత్ర ఎనలేదన్నారు. దీన్ని ఉచ్చరించకూడదని నిషేధం విధించారని ఆనాటి రోజులను గుర్తు చేశారు. దేశంలో అనేక చోట్ల ఉద్యమకారులను కఠినంగా అణిచి వేశారని వివరించారు. ఈ గేయంపై నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. ఉరిశిక్ష అమలు చేసే ముందు వందేమాతరం నినాదాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

 

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×