BigTV English
Advertisement

Pashupati Kumar Paras: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

Pashupati Kumar Paras: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!
Pashupati Kumar Paras
Pashupati Kumar Paras

Pashupati Kumar Paras: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో బిగ్ షాక్ తగిలింది. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పశుపతి కుమార్ పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఆయితే ఆయన రాజీనామాతో ఖాళీగా మారిన కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలను.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఆప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి పరాస్.. త్వరలోనే విపక్ష ఆర్జేడీ కూటమిలో చేరనున్నట్లు సమాచారం.


లోక్ సభ ఎన్నికల వేళ బిహార్ లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్డీయే కూటమి నుంచి ఓదొలుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తూ.. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అధనంగా అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన పశుపతి పరాస్ త్వరలోనే ఆర్జేడీ కూటమిలో చేరి హాజీపూర్ నుంచి చిరాగ్ పై పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Supreme Court: ఎన్నికల ముందు ఉచిత హామీలపై పిల్.. విచారణకు సుప్రీం రెడీ..


పొత్తులో భాగంగా బిహార్ లో ఎన్డీయే కూటమి చిరాగా పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీకి 5 సీట్లు కేటాయించింది. దీనిపై పశుపతి ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. బీహార్ లో తమకు 5 ఎంపీ సీట్లు ఉన్నాసరే పొత్తులో భాగంగా తమకు బీజేపీ ఒక్కసీటు ఇవ్వకుండా పక్కన పెట్టిందని.. దాని కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఓ గొప్ప నేత అని తాను ఎప్పుడూ.. మోదీకి రుణపడి ఉంటానన్నారు. అయితే ప్రస్తుతం పశుపతి పరాస్ ఎన్డీయే కూటమినుంచి బయటకు రావడంతో.. ఆయన బిహార్ ప్రతిపక్ష కూటమి అయిన ఆర్జేడీలో చేరాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నామని ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.

Related News

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Big Stories

×