E-Paper
Advertisement

Pappu Yadav: హస్తం గూటికి పప్పూ యాదవ్.. జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం..

Pappu Yadav: హస్తం గూటికి పప్పూ యాదవ్.. జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం..
Advertisement
Jan Adhikar Party Pappu Yadav Joined Congress
Jan Adhikar Party Pappu Yadav Joined Congress

Jan Adhikar Party Pappu Yadav Joined Congress: బీహార్ నాయకుడు పప్పు యాదవ్ బుధవారం తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు.

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో పప్పు యాదవ్ భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా జన్ అధికార్ పార్టీని 2015లో స్థాపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ అన్నారు.

Advertisement

రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. లాలూజీ, కాంగ్రెస్‌తో కలిసి 2024, 2025లో విజయం సాధిస్తామని పప్పు యాదవ్ అన్నారు.

తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ RJD, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది.

Advertisement

Also Read: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

అయితే లాలూ యాదవ్‌తో ఎలాంటి వైరం లేదని పప్పు అన్నారు. మంగళవారం లాలూ, తేజస్విలతో ఆయన భేటీ అనంతరం బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×