E-Paper
Advertisement

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం
Advertisement

President notifies appointment of Justice Sanjiv Khanna: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ అధికారికంగా వెల్లడించారు.

జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుతం సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక, జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వాత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.

Advertisement

ఆయన ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడెమీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి సీజేఐగా ఆయన 2025 మే 13 వరకు.. దాదాపు 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×