E-Paper
Advertisement

Rahul Gandhi | అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ గాంధీ

Rahul Gandhi | దేశంలో ఒకవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రం చేపట్టారు. ఈ యాత్రతో ఆయన దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి, లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానిక ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బాగా ఆలోచించి ఈ యాత్రను మణిపూర్ నుంచి మొదలుపెట్టారు.

Rahul Gandhi | అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | దేశంలో ఒకవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రం చేపట్టారు. ఈ యాత్రతో ఆయన దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి, లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానిక ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బాగా ఆలోచించి ఈ యాత్రను మణిపూర్ నుంచి మొదలుపెట్టారు.

మంగళవారం భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడవ రోజు సందర్భంగా రాహుల్ గాంధీ.. అయోధ్య రామ్ మందిర కార్యక్రమంపై పెదవి విప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..” కాంగ్రెస్ కోసం నేను ఈ యాత్ర ప్రారంభించాను. మాకు ముందు నుంచీ ఒక ప్లాన్ ప్రకారం యాత్రను కొనసాగిస్తాం. జనవరి 22న అయోధ్యలో కార్యక్రమం సమయానికి నేను అస్సాంలో ఉంటాను. అయినా ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనవరి 22 కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ షోగా మార్చేశారు. అది పూర్తిగా ఒక రాజకీయ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని వాళ్లు ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమానికి పోకూడదని నిర్ణయించారు.

Advertisement

మేము అన్ని మతాలను గౌరవిస్తామ, ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అయోధ్య కార్యక్రమానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. పైగా హిందూ మత పెద్దలే ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్లడం కష్టమే. నేను మతాన్ని ఆచరిస్తాను . దాని ద్వారా లాభాలు పొందాలను కోను. నేను హిందువునని నా షర్టుపై రాసుకొని తిరగను. నేను నా జీవితంలో హిందువుగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను పైకి చూపించుకోను. మతాన్ని గౌరవించని వాళ్లే ఇలాగా ఆర్భాటాలు చేస్తారు.” అని చెప్పారు.

Advertisement

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×