![Rahul gandhi latest news Rahul gandhi latest news](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/01/17a163f6ab3de102b49599f5577866fc.jpg)
Rahul Gandhi latest news(Telugu breaking news today):
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసమైంది. పశ్చిమ బెంగాల్లో జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో గుమిగూడటంతో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో తమ వద్ద అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారన్నారు. ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఆ సమయంలో రాహుల్ ఆ కారులో లేరు.
బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్డాలోకి బుధవారం మరోసారి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ఆ సమయంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్పై రాళ్లు వేశారని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ్ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని మమత ప్రకటించిన విషయం తెలిసిందే.