E-Paper
Advertisement

Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి.. ఎక్కడంటే..?

Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి..  ఎక్కడంటే..?

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటారు. అయినా సరే కాస్త సమయం దొరికితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సమాజాన్ని చైతన్యం చేసే కార్యక్రమాల్లో ముందుంటారు. గతంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహించి వాహనదారులకు జాగ్రత్తలు సూచించారు. ఇలా ఎలాంటి సందర్భం వచ్చినా జక్కన్న తన వంతుగా సొసైటీలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆయనను చాలా స్వచ్ఛంద సంస్థలు తమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూంటాయి. కాదనకుండానే రాజమౌళి ఆ కార్యక్రమాలకు హాజరవుతారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజమౌళి సేవలను ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేసింది.


రాజమౌళిని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా కర్నాటక ప్రభుత్వం నియమించింది. ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో కర్నాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. మనదేశంలో చాలామంది ఓటు వేసేందుకు ముందుకురారు. దీంతో ఓటింగ్ శాతం పెరగడంలేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటర్లను చైతన్యపర్చేందుకు రాజమౌళి సేవలను వినియోగించుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజమౌళి పేరు సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను రాజమౌళి కూడా ఆమోదించారు.


విశేషమేమిటంటే రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో రాజమౌళి జన్మించారు. ఇప్పుడు తను పుట్టిన ప్రాంతంలో ఎన్నికల ప్రచారకర్తగా సేవలు అందించబోతున్నారు. ఎన్నికల ప్రచారకర్తగా నియమితులైనవారు ప్రత్యక్షంగా ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. వీడియో సందేశాలతో ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలతో ఓటరు చైతన్యానికి కృషి చేస్తారు. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు రాజమౌళి అమెరికా వెళ్లారు. RRR టీమ్ తో కలిసి సందడి చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల ముందు రాయచూరు జిల్లాలో ఓటర్ల చెంతకు రాజమౌళి వెళ్లి వారిని చైతన్యం చేయనున్నారు.

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Nagababu Tammareddy: రూ.80 కోట్లు మీ అమ్మా మొగుడు ఖ‌ర్చు పెట్టాడా?.. త‌మ్మారెడ్డిపై నాగ‌బాబు ఫైర్‌

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×