E-Paper
Advertisement

Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఏముందంటే..? కుక్కకు కూడా..

Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఏముందంటే..? కుక్కకు కూడా..
Advertisement
Advertisement

రతన్ టాటాకు ఉన్న 10 వేల కోట్ల ఆస్తులు.. తన పెంపుడు కుక్క టిటోతో పాటు తన వ్యక్తిగత సహాయకుడు, వంటమనిషి, డ్రైవర్‌తో పాటు ఆయన సోదరుడు జిమ్మీ టాటా, స‌వ‌తి సోద‌రి షిరీన్‌, డియ‌న్నా జిజోబీ, ఇంటి సిబ్బంది, ఇతరులతో పాటు ఆయన నెలకొల్పిన ఎండోమెంట్ ఫౌండేషన్‌కు చెందుతాయని వీలునామాలో రాశారు. రతన్ టాటాకు మూగజీవాలు, కుక్కలంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు. వీధి కుక్కల సంరక్షణ కోసం ఆయన ఆస్పత్రులను కూడా నిర్మించారు.  చివరిసారిగా ఆయన పని చేసిన ప్రాజెక్ట్‌ కూడా శునకాలకు సంబంధించినదే! ముంబైలో.. ఐదంతస్తుల భవనంలో పెట్ ప్రాజెక్ట్ పేరిట దీన్ని ప్రారంభించారు. దీనిలో.. 200 కుక్కలు ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు.

ర‌త‌న్ టాటా ఆస్తుల్లో.. అలీబాగ్‌లో ఉన్న రెండు వేల చ‌ద‌ర‌పు అడుగుల భవనం, ముంబైలోని జూహూ తారా రోడ్డులో రెండు అంత‌స్తుల బిల్డింగ్‌ ఉన్నాయి. అలాగే.. రూ.350 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా స‌న్స్‌లో 0.83 శాతం షేర్లు ఉన్నాయి. వీలునామా ప్రకారం.. టాటా సన్స్‌లో ఉన్న షేర్లు.. టాటా ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు. అదేవిధంగా టాటా గ్రూప్, టాటా మోటార్స్‌లో ఉన్న షేర్లు కూడా ర‌త‌న్ టాటా ఎండోమెంట్ ఫౌండేష‌న్‌కు వెళ్తాయి. వివిధ స్టార్టప్స్‌లో రతన్ టాటాకు ఉన్న షేర్లను నగదుగా మార్చి.. ఆ మొత్తాన్ని ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు. ఇక.. రతన్ టాటాకు చెందిన దాదాపు 30 కార్లకు సంబంధించి.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Advertisement

Also Read: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

వాటిని.. టాటా గ్రూపే స్వాధీనం చేసుకోవాలా? పుణె మ్యూజియంలో ప్రదర్శించేందుకు తరలించాలా? వేలం వేయాలా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇక.. రతన్ టాటాకు వచ్చిన అవార్డులను.. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో ప్రదర్శించనున్నారు. వంద బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన రతన్ టాటా.. ఏనాడూ అత్యంత సంపన్నుల జాబితాలో కనిపించలేదు. చివరిదాకా ఆయన నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఇప్పడు.. తన వీలునామాలో రాసిన అంశాలు, తన పెంపుడు కుక్కకు, తన దగ్గర పనిచేసిన వాళ్లకు రతన్ టాటా ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవాన్ని చూస్తే.. ఆయన మహోన్నతమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మరోసారి అర్థమైంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×