BigTV English

Sharukh Khan : రాత్రి 2 గంటలకు ఆ సీఎంకు షారుఖ్ ఫోన్ ..ఎందుకంటే..?

Sharukh Khan : రాత్రి 2 గంటలకు ఆ సీఎంకు షారుఖ్ ఫోన్ ..ఎందుకంటే..?

Sharukh Khan : షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే జంటగా నటించిన బాలీవుడ్ మూవీ పఠాన్ పై కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాను అడ్డుకుంటామని కొందరు బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పఠాన్‌’ చిత్రంలో బేషరమ్‌ పాటలో దీపికా పదుకొణె బికినీ దృశ్యాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వహిందూ పరిషత్‌, కొందరు బీజేపీ నేతలు ఆ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అస్సాంలోని గోహతిలో శుక్రవారం భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ‘పఠాన్‌’ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఆ సినిమా పోస్టర్లను చింపేసి నిప్పుపెట్టి నిరసన చేపట్టారు.


ఈ పరిణామాలపై విలేకర్లు సీఎం హిమంత బిశ్వశర్మను ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం తనకు షారుఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదన్నారు. పఠాన్‌ చిత్రం గురించి తెలీదని చెప్పారు. ఈ సమస్యపై బాలీవుడ్ నుంచి అనేక మంది తనకు ఫోన్‌ చేశారని తెలిపారు. అయితే శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటామని హిమంత స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం రాత్రి 2 గంటలకు షారుఖ్ ఖాన్ …హిమంత బిశ్వశర్మకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా అస్సాం సీఎం ట్వీట్ చేశారు. గోహతిలో జరిగిన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. శాంతిభద్రతల్ని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని షారుక్ కు చెప్పానన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చానని సీఎం ట్వీట్ చేశారు.

అయితే షారుఖ్ ఖాన్‌ ఎవరు? ఆయన గురించి, ఆయన సినిమాల గురించి తనకు తెలియదని అస్సాం సీఎం వ్యాఖ్యానించిన మరుసటి రోజే షారుఖ్ ఖాన్ ఫోన్ చేయడం విశేషం. అదే విధంగా షారుఖ్ ఫోన్ చేసిన విషయాన్ని స్వయంగా సీఎం హిమంత బిశ్వశర్మే వెల్లడించారు. ఈ సినిమా ప్రదర్శనలకు భరోసా ఇచ్చారు.


Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×