E-Paper
Advertisement

Rahul Gandhi: ఒరిగిన స్టేజ్.. రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన పెనుప్రమాదం!

Rahul Gandhi: ఒరిగిన స్టేజ్.. రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన పెనుప్రమాదం!

Stage Caves in as Rahul Gandhi: బీహార్‌లో ఇండియా కూటమి పలిగంజ్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన స్టేజ్‌ మీదికి వస్తున్న సయయంలో స్టేజ్‌ పాక్షికంగా కిందకి ఒరిగింది. తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్‌ స్టేజ్‌ మీదకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రాహుల్‌కు సాయం చేయబోయారు. అయితే తాను బాగానే ఉన్నానని సెక్యూరిటీకి సర్ది చెప్పిన రాహుల్.. ఆ తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

బీహార్ లో ఇండియా కూటమి బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాలేరని, దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మద్దతు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్ ను రద్దు చేస్తామని మరోసారి చెప్పారు. 2022లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అగ్నివీరులుగా పిలిచే యువ సైనికులను నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారని, వారిలో 75 శాతం మందికి సైనిక ప్రయోజనాలు ఉండవన్నారు.

ప్రధాని మోదీ.. దేశాన్ని రక్షించాల్సిన సైనికులను కార్మికులుగా మార్చారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఒక సైనికుడు గాయపడినా, అమరుడైనా అతనికి లభించాల్సిన పరిహారం, హోదా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తనను తాను దేవదూతగా చెప్పుకునే మోదీ.. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని, తనను దేవుడే పంపాడని చెబుతారని విమర్శించారు.

Also Read: Pandemic: ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో సంక్షోభం ?

అనంతరం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. విభజన వాక్చాతుర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, హామీలను నెరవేర్చడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. బీహార్ ప్రజలు తమతో చెప్పిన అబద్ధాలకు, హిందూ-ముస్లిం చర్చలకు ప్రతీకారం తీర్చుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రధాని నోరు మెదపలేదని దుయ్యబట్టారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×