E-Paper
Advertisement

Mango Fruits Grows on Neem Tree: మంత్రి బంగ్లాలో విడ్డూరం.. వేప చెట్టుకు కాస్తున్న మామిడి పండ్లు..!

Mango Fruits Grows on Neem Tree: మంత్రి బంగ్లాలో విడ్డూరం.. వేప చెట్టుకు కాస్తున్న మామిడి పండ్లు..!
Advertisement

Mango Fruits Grows on Neem Tree in Minister Home: మధ్యప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. భోపాల్ లోని పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. ఈ విషయం మంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఆయన అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉండొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ బంగ్లా భోపాల్ లోని ప్రొఫేసర్ కాలనీకి సమీపంలో ఉంది. గతంలో ఈ బంగ్లా ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది. ఈసారి ప్రహ్లాద్ పటేల్ కు కేటాయించారు. ఆ బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో మొక్కలు, చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనులను పరిశీలించడానికి మంత్రి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో వేప చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. వేప చెట్టుకు మామిడి కొమ్మ అంటుకుని ఉండి, దానికి మామిడి పండ్లు కాస్తుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Also Read: 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయుర్వేద వైద్యుడు

ఆ తరువాత విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు చేరవేశారు. అక్కడికి చేరుకుని పరిశీలించిన శాస్త్రవేత్తలు మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు ఇలా అవి మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వింతగా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Tags

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×