Sukesh Another Letter to Kejriwal(Telugu flash news): మండోలి జైలు నుంచి సుకేశ్ చంద్రశేఖర్.. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో లేఖ రాశాడు. ఈసారి కేజ్రీవాల్ ఆరోగ్యం, డ్రామాపై సుకేశ్ తనదైన శైలిలో స్పందించాడు. కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండటం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు. అయితే.. కొద్దిరోజులుగా మీ డ్రామా, ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లను చూస్తున్నానని.. అవినీతి సహచరులు, జైలు అధికారులు, వదిన కూడా మీతో కలిసి నటించడం చూస్తుంటే.. ప్లే స్కూల్లో నేర్చుకున్న రైమ్స్ గుర్తొస్తున్నాయని పేర్కొన్నాడు.
కేజ్రీవాల్ కేజ్రీవాల్ యస్ పాపా
షుగర్ తింటున్నావా లేదు పాపా
అబద్ధాలు చెప్పడం లేదు నాన్న
ప్రజలను మోసం చేస్తున్నావు కదు పప్పా
డైట్ చార్ట్ బహిర్గతం.. హాహాహా అని ఆ లెటర్ లో కేజ్రీవాల్ పై రైమ్ రాసుకొచ్చాడు సుకేశ్.
Also Read : కేజ్రీవాల్ను ప్రశ్నించిన సుప్రీం.. ‘ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..?’
తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎంజాయ చేస్తూనే ప్రజల సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నారని, మెడికల్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారని ఆరోపించాడు. కేజ్రీవాల్ ఎవరిని మోసం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తూ ఉంటారని, వాళ్లు అంత తేలికగా మోసపోరని పేర్కొన్నారు. కేజ్రీవాల్ లిక్కర్ కేసులోనే కాకుండా.. ఇంకా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, అన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే కేజ్రీవాల్ కు శిక్ష పడుతుందని