Actress Radha Attack on Realtor: సుందరా ట్రావెల్ ఫేం హీరోయిన్ రాధ వివాదంలోకి వచ్చేసింది. ఏకంగా ఆమె తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చావబాదింది. ఈ ఘటన కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. చివరకు బాధితుడు నటి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగింది. ఇంకో లోతుల్లోకి వెళ్తే..
సుందరా ట్రావెల్ సినిమాలో కోలీవుడ్లో ఫేమస్ అయ్యింది నటి రాధ. కెరీర్ పీక్గా ఉన్న సమయంలో నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలని భావించి బిజినెస్లోని అడుగుపెట్టింది. రియల్టర్ మురళీకృష్ణన్.. తన మిత్రుడు ద్వారకేష్కి నటి రాధను పరిచయం చేశాడు. ఈ పరిచయం కాస్త బిజినెస్లో పెట్టుబడులు పెట్టేంతవరకు వెళ్లింది.
బిట్ కాయిన్స్ వేలాది రూపాయలను పెట్టుబడి పెట్టింది నటి రాధ. కాకపోతే ఆ వ్యక్తి నుంచి రాధకు రిటర్న్స్ రాలేదు. అలాగని అసలు కూడా చెల్లించలేదు. దీంతో రాధ, ఆమె ఫ్యామిలీ సభ్యులతోపాటు మరికొందరు రియల్టర్ మురళీకృష్ణన్ కార్యాలయానికి వచ్చి దాడి చేశారు. ఆయన్ని చావబాదారు.
Also Read: Brahmanandam: శ్రీశ్రీ పెయింటింగ్.. బ్రహ్మీ ఎంత బాగా వేశాడో చూడండి
అంతేకాదు రాధ.. తనను కింద పడేసి కాలు తన్నారని ఆరోపించాడు మురళీకృష్ణన్. చెన్నైలోని రాయపేటలోని ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. ట్రీట్మెంట్ తర్వాత వడపళని పోలీసుస్టేషన్లో నటి రాధపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఖాకీల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.