E-Paper
Advertisement

NEET UG 2024 Row: నీట్ కౌన్సిలింగ్‌పై స్టేకు సుప్రీం నో..

NEET UG 2024 Row: నీట్ కౌన్సిలింగ్‌పై స్టేకు సుప్రీం నో..
Advertisement

Supreme Court Refuses to Stay NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి నిరాకరించింది. పేపర్ లీకేజీ అంశంపై అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లతో పాటు తాజా పిటిషన్‌లను ట్యాగ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశంపై తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.

జులై మొదటి వారంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారించింది.

Advertisement

గత వారం సుప్రీం కోర్టు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయాలన్న వాదనను తిరస్కరించింది. మే 5న ఎన్టీయే నీట్ పరీక్షను నిర్వహించింది. కాగా జూన్ మొదటి వారంలో ఫలితాలు వచ్చాయి. దాదాపు 60 మంది విద్యార్థులు పూర్తి స్థాయి మార్కులు సాధించడంతో అనుమానాలు వెల్లువెత్తాయి. గ్రేస్ మార్కులు కలపడాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు అభ్యర్థులు. అసలు నీట్ పరీక్ష నిర్వహణే నీట్‌గా లేదని.. పరీక్షను రద్దు చేయాలని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read: అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు

Advertisement

ఇదిలా ఉండగా నీట్ యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యక్తిగత పీఏ ప్రీతమ్ కుమార్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీలో పాలు పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సికిందర్ ప్రసాద్‌కు ప్రీతమ్ కుమార్ మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×