BigTV English
Advertisement

Tamil Nadu Crime: టీచర్ ను ప్రేమించాడు.. క్లాస్ రూమ్ లోనే పొడిచాడు.. ఆ తర్వాత?

Tamil Nadu Crime: టీచర్ ను ప్రేమించాడు.. క్లాస్ రూమ్ లోనే పొడిచాడు.. ఆ తర్వాత?

Tamil Nadu Crime: ప్రేమించాడు.. వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె నిరాకరించింది. గౌరవ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆ మహిళను ఏకంగా ఆ ప్రేమోన్మాది క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ పట్టణంలో గల పాఠశాలలో బుధవారం జరిగింది. అయితే కత్తితో తమ టీచర్ పై జరిగిన దాడితో, తరగతి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.


తంజావూరు జిల్లాకు చెందిన రమణి అనే మహిళా ఉపాధ్యాయురాలు ఓ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలకు ఆమె రాకపోకలు సాగించే సమయంలో మదన్ అనే యువకుడు ఆమెను ప్రేమ పెళ్లి పేరుతో వేధించేవాడు. గౌరవమైన వృత్తిలో గల రమణి.. పలుమార్లు మదన్ ను వారించి హెచ్చరించింది. అయినా తన పద్ధతి మార్చుకొని మదన్.. అదే పంథాలో ఆమెను ఎప్పుడూ వేధింపులకు గురి చేసేవాడు.

ఇలాంటి పరిస్థితుల్లోనే మదన్ ఉన్మాదిగా మారి, ఏకంగా రమణిని కత్తితో పొడిచాడు. రమణి రోజువారి మాదిరిగానే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో, మదన్ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాలు ఆగిన అనంతరం తాను తెచ్చుకున్న కత్తితో ఏకంగా తరగతి గదిలోనే ఆమెపై దాడి చేశాడు. హఠాత్తుగా తమ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడికి పాల్పడడంతో, విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు.


Also Read: Viral Video: ఇండియా గేట్ ముందే అర్ధనగ్న ప్రదర్శన.. యువతి హల్చల్.. కారణం అదేనట..

కత్తితో పొడిచిన మదన్ అక్కడి నుండి పారిపోగా, పాఠశాల యాజమాన్యం వెంటనే రమణిని స్థానిక వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే రమణి మృతి చెందగా, పాఠశాల ఆవరణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ల ముందే టీచర్ చనిపోవడంతో విద్యార్థులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, జరిగిన అసలు విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రేమోన్మాది మదన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×