E-Paper
Advertisement

Tamil Nadu Crime: టీచర్ ను ప్రేమించాడు.. క్లాస్ రూమ్ లోనే పొడిచాడు.. ఆ తర్వాత?

Tamil Nadu Crime: టీచర్ ను ప్రేమించాడు.. క్లాస్ రూమ్ లోనే పొడిచాడు.. ఆ తర్వాత?
Advertisement

Tamil Nadu Crime: ప్రేమించాడు.. వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె నిరాకరించింది. గౌరవ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆ మహిళను ఏకంగా ఆ ప్రేమోన్మాది క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ పట్టణంలో గల పాఠశాలలో బుధవారం జరిగింది. అయితే కత్తితో తమ టీచర్ పై జరిగిన దాడితో, తరగతి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

తంజావూరు జిల్లాకు చెందిన రమణి అనే మహిళా ఉపాధ్యాయురాలు ఓ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలకు ఆమె రాకపోకలు సాగించే సమయంలో మదన్ అనే యువకుడు ఆమెను ప్రేమ పెళ్లి పేరుతో వేధించేవాడు. గౌరవమైన వృత్తిలో గల రమణి.. పలుమార్లు మదన్ ను వారించి హెచ్చరించింది. అయినా తన పద్ధతి మార్చుకొని మదన్.. అదే పంథాలో ఆమెను ఎప్పుడూ వేధింపులకు గురి చేసేవాడు.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లోనే మదన్ ఉన్మాదిగా మారి, ఏకంగా రమణిని కత్తితో పొడిచాడు. రమణి రోజువారి మాదిరిగానే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో, మదన్ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాలు ఆగిన అనంతరం తాను తెచ్చుకున్న కత్తితో ఏకంగా తరగతి గదిలోనే ఆమెపై దాడి చేశాడు. హఠాత్తుగా తమ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడికి పాల్పడడంతో, విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు.

Also Read: Viral Video: ఇండియా గేట్ ముందే అర్ధనగ్న ప్రదర్శన.. యువతి హల్చల్.. కారణం అదేనట..

Advertisement

కత్తితో పొడిచిన మదన్ అక్కడి నుండి పారిపోగా, పాఠశాల యాజమాన్యం వెంటనే రమణిని స్థానిక వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే రమణి మృతి చెందగా, పాఠశాల ఆవరణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ల ముందే టీచర్ చనిపోవడంతో విద్యార్థులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, జరిగిన అసలు విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రేమోన్మాది మదన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×