BigTV English
Advertisement

Telangana Tejasri Drowned In Sarayu River: విషాదం.. సరయూ నదిలో తెలంగాణ యువతి గల్లంతు!

Telangana Tejasri Drowned In Sarayu River: విషాదం.. సరయూ నదిలో తెలంగాణ యువతి గల్లంతు!

Telangana Tejasri Drowned In Sarayu River: అయోధ్య యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరయూ నదిలో స్నానానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ బాలిక గల్లంతు అయింది. పుణ్య స్నానం చేస్తున్న సమయంలో వరద ప్రవాహం పెరగింది. దీంతో జనగామ జిల్లా చెందిన తాళ్లపెల్లి తేజశ్రీ(17) కొట్టుకుపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ పట్టణంలోని గీతానగర్ ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య యాత్రకు వెళ్లారు. మొత్తం 8 మంది బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి ఈనెల 28న బాలరాముడి దర్శనానికి వెళ్లారు. రాముడిని దర్శించుకున్న అనంతరం సరయూ నదికి వద్ద లక్ష్మణ్ ఖిల్లా ఘాట్ వద్ద కాసేపు సేద తీరారు. అనంతరం సెల్ఫీలు దిగుతున్న సమయంలో తేజశ్రీతోపాటు మరో నలుగురు యువతులు నదిలోకి దిగారు. ఎగువ ప్రాంతంలో ఉన్న నేపాల్ డ్యాం నుంచి నీటిని వదలడంతో వరద ప్రవాహం పెరిగింది.

Also Read: వయనాడ్ లో గంటగంటకూ పెరుగుతున్న మరణాలు.. 143కి చేరిన మృతులు


అయితే, ఐదుగురు యువతులు నదిలో కొట్టుకుపోవడంతో బంధువులు కేకలు వేశారు. వెంటనే రెస్క్యూ టీం నదిలోకి దూకి నలుగురిని కాపాడారు. కానీ తేజశ్రీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదని బాధిత తండ్రి నాగరాజు చెప్పాడు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..అధికారులతో ఫోన్ మాట్లాడారు. యూపీ సీఎంతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికీ బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరుగా నాగరాజు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Big Stories

×