BigTV English
Advertisement

PM Modi Vs Rahul Gandhi: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. కేంద్రం క్లారిటీ..

PM Modi Vs Rahul Gandhi: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. కేంద్రం క్లారిటీ..

PM Modi Vs Rahul Gandhi: ప్రధాని మోదీ ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. రాహుల్‌ ఆరోపనలపై వాస్తవాలు అంటూ మోదీ జన్మించిన కులం గురించి స్పష్టత ఇచ్చింది.


ప్రధాని మోదీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని కేంద్రం బదులిచ్చింది. 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు.

గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్‌ సిపారసుల మేరకు 91(A) ఇండెక్స్‌ కింద ఓబీసీ జాబితాను తయారుచేసింది. అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉంది. దీనిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు మోదీ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు ప్రకటనలు ఇచ్చిన సమయంలో మోదీ అధికారంలో లేరని కేంద్రం వెల్లడించింది.


అయితే ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి తాను ఓబీసీననే విషయం గుర్తుకు వస్తుందని కొద్దిరోజుల క్రితం రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. లేకపోతే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని మోదీ చెప్తారని రాహుల్ అన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోదీ స్పందించారు.

Read More: ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూను కాంగ్రెస్ గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను గుడ్డిగా అనుసరిస్తున్నారని మోదీ గట్టిగా వ్యతిరేకించారు. తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చామని ఆయన త వెల్లడించారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×