BigTV English

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!
Mother Protest
Mother Protest

3 Kids Mother Protest for Lover and Husband: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల ఘటనలు పెరిగిపోతున్నాయి. తరచూ ఏదో ఒక ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది. భార్యను భర్త మోసం చేయడం, భర్తను భార్య మోసం చేయడం వంటి ఘటనలతో కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో రహస్యంగా సంబంధం నడిపిస్తుంది ఓ ముగ్గురు పిల్లల తల్లి. భర్త గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. తనకు భర్తతో పాటు ప్రియుడు కూడా కావాలని, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం అంటూ పట్టుబట్టింది. దీనికి భర్త అంగీకరించలేదు. ఇక మొండిపట్టు పట్టిన ఆ మహిళ కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసింది.


గోరఖ్‌పూర్‌ పిప్రాయిచ్‌‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి సుమన్ దేవి అనే మహిళలకు ఓ వ్యక్తితో పెళ్లి అయింది. ఇద్దరికీ కలిపి ముగ్గురు పిల్లల సంతానం ఉండగా.. సుమన్ దేవి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఈ విషయం దేవి భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. ప్రియుడితోనే కలిసి ఉంటానని, తమ ఇంట్లోనే ఉందాం అంటూ భర్తతో గొడవ పడింది. దీనికి భర్త అంగీకరించకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కరెంటు పోలు ఎక్కి నిరసన తెలిపింది. వెంటనే గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖకు ఫోన్ చేసి కరెంటు నిలిపివేయించారు.

Also Read: డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా?


వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దేవిని కిందకు దించారు. అనంతరం దేవి భర్త పోలీసులకు జరిగిన విషయం చెప్పడంతో కేసు నమోదు చేశారు. కాగా, నెల రోజుల క్రితం కూడా దేవి రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త పోలీసులకు తెలిపాడు. ఒకసారి 5వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించగా.. మరోసారి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×