BigTV English
Advertisement

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?


Gujarat : రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీసిన ఓ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భుజ్ లో పర్యటించారు. 2001లో సంభవించిన పెను భూకంప బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఆ తర్వాత సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. ఆ సమయంలో సభలో కూర్చున్న ఓ అధికారి నిద్రపోయారు. ఆ ఆఫీసర్ కునుకు తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించింది.


సీఎం సభలో నిద్రపోయిన అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించారని పేర్కొంది. నిబంధనల ప్రకార జిగర్ పటేల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిద్రపోయి ఆ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు.

Related News

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Big Stories

×