BigTV English

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?


Gujarat : రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీసిన ఓ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భుజ్ లో పర్యటించారు. 2001లో సంభవించిన పెను భూకంప బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఆ తర్వాత సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. ఆ సమయంలో సభలో కూర్చున్న ఓ అధికారి నిద్రపోయారు. ఆ ఆఫీసర్ కునుకు తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించింది.


సీఎం సభలో నిద్రపోయిన అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించారని పేర్కొంది. నిబంధనల ప్రకార జిగర్ పటేల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిద్రపోయి ఆ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×