E-Paper
Advertisement

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి
Advertisement

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో బండరాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులను ఢీకొట్టాయి. హిమాలయ దేవాలయానికి మోటారు సైకిల్‌పై వెళ్లిన పర్యాటకులను బండరాళ్లు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. మృతులు నిర్మల్ షాహి(36), సత్య నారాయణ(50)లుగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి అక్కడి అధికారులు మృతదేహాలను వెలికితీయించారు.

Advertisement

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం అమర్ నాథ్, చార్ ధమ్ యాత్ర కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ యాత్రలకు తెలంగాణ నుంచి కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకొని బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కొండచరియలు విరిగి వీరి బైక్ పై పడ్డాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×