E-Paper
Advertisement

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో బండరాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులను ఢీకొట్టాయి. హిమాలయ దేవాలయానికి మోటారు సైకిల్‌పై వెళ్లిన పర్యాటకులను బండరాళ్లు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. మృతులు నిర్మల్ షాహి(36), సత్య నారాయణ(50)లుగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి అక్కడి అధికారులు మృతదేహాలను వెలికితీయించారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం అమర్ నాథ్, చార్ ధమ్ యాత్ర కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ యాత్రలకు తెలంగాణ నుంచి కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకొని బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కొండచరియలు విరిగి వీరి బైక్ పై పడ్డాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×