BigTV English

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ పర్యాటకులు మృతి

Tragedy in Chamoli: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి.


ఈ ఘటనలో బండరాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులను ఢీకొట్టాయి. హిమాలయ దేవాలయానికి మోటారు సైకిల్‌పై వెళ్లిన పర్యాటకులను బండరాళ్లు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. మృతులు నిర్మల్ షాహి(36), సత్య నారాయణ(50)లుగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి అక్కడి అధికారులు మృతదేహాలను వెలికితీయించారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం అమర్ నాథ్, చార్ ధమ్ యాత్ర కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.


ఈ యాత్రలకు తెలంగాణ నుంచి కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకొని బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి కొండచరియలు విరిగి వీరి బైక్ పై పడ్డాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×