Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సేలంలో నిర్వహిస్తున్న ర్యాలీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఒక వ్యక్తి గుండెపోటుతో లేదా తొక్కిసలాట వంటి పరిస్థితుల కారణంగా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విజయ్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానుల రద్దీ, వేడి వాతావరణం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
సాలెం ర్యాలీలో మృతి చెందిన వ్యక్తి మరణానికి డిహైడ్రేషన్ (నిర్జలీకరణం) కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు ఇటీవల ఆంజియోగ్రామ్ (గుండె చికిత్స) చేయించుకున్నట్లు సమాచారం. ఎండ తీవ్రత, జనసందోహం మధ్య శారీరక శ్రమ తట్టుకోలేక ఆయన మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో సుమారు 41 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే, ఇప్పుడు సేలం ర్యాలీలో మరో ప్రాణం పోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నింపింది.
Read Also: Thalapathy Vijay: ప్రభుత్వం ఇచ్చే డబ్బును తీసుకోండి కానీ ఓటు మాత్రం టీవీకేకే వేయండి.. దళపతి విజయ్