BigTV English

Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!

Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!
Advertisement

Two Farmers Died On Khanauri Border: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు నిరాకరిస్తూ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు,ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు రైతులు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ తరుణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఈ క్రమంలోనే రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ కాల్పుకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జింద్ డేటా సింగ్ వాలా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది రైతులు గాయపడ్డారు. పోలీసులు కొందరు రైతులను అరెస్టు చేసి హర్యానాకు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు రైతులపై లాఠీలు ఝుళిపించారు.

పలువురు రైతులు పొలాల గుండా సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో వైపు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరో వైపు శంభు సరిహద్దుల్లో రైతుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల చండీగడ్ లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలు రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అర్జున్ ముండా రైతులను చర్చలకు ఆహ్వానించారు.


Read More: 1000 కార్లు చోరీ చేసి.. జడ్జిగా అవతారం ఎత్తి..

రైతులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని అర్జున్ ముండా అన్నారు. పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్దమని ప్రకటించారు. అయితే, కేంద్రంతో చర్చల విషయంలో చర్చల విషయంలో రైతు సంఘాలు ఏకగ్రీవంగా సమ్మతించడం లేదన్నారు.

పలువురు రైతు నేతలు చర్చలకు సిద్దమైనా.. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏ సమస్య పరిష్కారం కాలేదని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు. చాలా మంది రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా.. యువ రైతులు మాత్రం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేట్లను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related News

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Big Stories

×