E-Paper
Advertisement

Akhilesh Yadav: ‘ఆల్ ఈజ్ వెల్’.. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు: అఖిలేష్‌

Akhilesh Yadav: ‘ఆల్ ఈజ్ వెల్’.. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు: అఖిలేష్‌
Advertisement

Alliance Between Samajwadi party and Congress: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం అఖిలేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సీట్ల పంపకాల చర్చలపై అస్పష్టత తొలగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పొత్తు చెక్కుచెదరలేదని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు సరైన దారిలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

లక్నోలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. మొత్తం 17 సీట్లు కాంగ్రెస్‌కు అఖిలేష్ ఆఫర్‌గా పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను కాంగ్రెస్ అంగీకరించే వరకు రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవని, త్వరలోనే మీకు తెలుస్తుందని ‘ఆల్ ఈజ్ వెల్…’ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ‘మేము పోటీ చేయగలిగినన్ని సీట్ల నుండి పోటీ చేస్తుంది’ అని అఖిలేష్ చెప్పారు. యూపీలో 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Read More: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి..!

Advertisement

తాజా అభ్యర్థుల జాబితాలో, బుదౌన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ మామ శివపాల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దింపింది. వారణాసి నుండి సురేంద్ర సింగ్ పటేల్, కైరానా నుంచి ఇక్రా హసన్, బరేలీ నుంచి ప్రవీణ్ సింగ్ అరోన్ ఉన్నారు. ఎస్పీ తన తొలి జాబితాలో బుదౌన్ నుంచి పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ కుమారుడు ధర్మేంద్ర యాదవ్‌ను బరిలోకి దింపింది.

తన తల్లి సోనియా గాంధీ ఇప్పటి వరకు ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి తొలిసారి లోక్‌సభ బరిలోకి దిగబోతున్న ప్రియాంక గాంధీ .. యూపీలో సీట్ల షేరింగ్ విషయంలో కీలకంగా వ్యవహారిస్తున్నారు.

రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ప్రియాంక, అఖిలేష్ ఇద్దరూ హాజరవుతారా?
ఫిబ్రవరి 24న మొరాదాబాద్ నుంచి రాహుల్ గాంధీ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు, తాను ఆసుపత్రిలో చేరానని, అందుకే హాజరు కాలేదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్ సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాతే యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ కూడా హెచ్చరిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు ప్రియాంక, అఖిలేష్‌ ఇద్దరూ హాజరవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×