E-Paper
Advertisement

US Visa : విదేశాల్లోని భారతీయులకు గుడ్ న్యూస్.. స్వదేశం రాకుండానే అమెరికా వీసా..

US Visa : విదేశాల్లోని భారతీయులకు గుడ్ న్యూస్.. స్వదేశం రాకుండానే అమెరికా వీసా..

US Visa : వ్యాపార అవసరాల కోసం, విహారయాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసాపై యూఎస్ వెళ్లాలనుకునే విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. అమెరికా తాజా నిర్ణయం వల్ల విదేశాల్లో ఉండే భారతీయులు అమెరికా వీసా కోసం స్వదేశానికి రావాల్సిన అవసరం ఉండదు. వారు ప్రస్తుతం ఉన్న దేశంలోనే వీసా పొందవచ్చు.

“త్వరలో మీరు విదేశీ ప్రయాణం చేయబోతున్నారా? అయితే వీసా అపాయింట్‌మెంట్‌ మీరు నివసిస్తున్న దేశంలోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయం నుంచి పొందొచ్చు. థాయ్‌లాండ్‌లోని భారతీయుల కోసం బ్యాంకాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’’ అని భారత అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

భారత్‌లో అమెరికా వీసా జారీలో ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జాప్యాన్ని తగ్గించడానికి అమెరికా కొత్త నిబంధన తీసుకొచ్చింది. వీసాలు వేగంగా జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని పెంచింది. ఇటీవలే 2 లక్షల 50 వేల బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లను దరఖాస్తుదారుల కోసం అందుబాటులో ఉంచింది.

వీసా అపాయింట్‌మెంట్‌, జారీలో నెలకొన్న జాప్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అమెరికా కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు. అదనంగా విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు సిబ్బందిని పంపి అక్కడి భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ లో బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌ గడువు దాదాపు వెయ్యి రోజులు ఉండటంతో భారత్‌లోని అమెరికన్‌ రాయబార కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×