BigTV English

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం

Uttam Kumar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ ఈ నెలాఖరు నాటికి రద్దు అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ మతపరంగా విభజిస్తోందని మండిపడ్డారు.


సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకం, మట్టి, ఇసుక తవ్వకాలు, మద్యం సిండికేట్ లో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.

శాసనసభ రద్దు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన ఈ కామెంట్స్ చేశారో ఎవరికీ అర్థం కావడంలేదు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×