E-Paper
Advertisement

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం

Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం

Uttam Kumar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ ఈ నెలాఖరు నాటికి రద్దు అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ మతపరంగా విభజిస్తోందని మండిపడ్డారు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకం, మట్టి, ఇసుక తవ్వకాలు, మద్యం సిండికేట్ లో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.

శాసనసభ రద్దు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన ఈ కామెంట్స్ చేశారో ఎవరికీ అర్థం కావడంలేదు.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిక కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×