E-Paper
Advertisement

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి
Advertisement

Uttarakhand Road Accident(Today latest news telugu): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోతైన లోయలో పడింది. బద్రీనాథ్ హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం.. ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి

Advertisement

రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో అలకనదిలో టెంపో ట్రావెలర్ పడినట్లు తెలుస్తోంది. నదిలో పడిన ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడగా.. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

స్పందించిన సీఎం..

Advertisement

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ససింగ్ ధామి స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నానని పుష్కర్ ధామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×