BigTV English
Advertisement

Uttarakhand| ‘వాహనాల్లో డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉండాలి లేకుంటే భారీ జరిమానా’.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు!

Uttarakhand| ‘వాహనాల్లో డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉండాలి లేకుంటే భారీ జరిమానా’.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు!

Uttarakhand| రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రవేశించే ప్రతి వాహనం లో డస్ట్ బిన్ (చెత్తబుట్ట)లు తప్పనిసరిగా ఉండాలని గురువారం జూలై 25న ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమాన్ని పాటించకపోతే భారీ జరిమానా లాంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. రాష్ట్రంలో ప్రకృతిని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


ఉత్తరాఖండ్ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఇటీవల పొరుగు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీ ప్రకారం.. చార్ ధామ్ తీర్థ యాత్ర కోసం ఉత్తరా ఖండ్ లో ప్రవేశించే ప్రతీ వాహనంలో డస్ట్ బిన్లు, గార్ బేజ్ బ్యాగులు తప్పని సరిగా ఉండాలి. ప్రయాణీకులు దారిపై చెత్త వేయకూడదు, ఉమ్మివేయ కూడదు.


నియమాలు పాటించపోతే భారీ జరిమానా
ఉత్తరాఖండ్ లో ప్రవేశించే ప్రతి వాహనాన్ని చెక్ చేసి, ఒకవేళ నియమాలు ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా విధించండి అని ఉత్తరా ఖండ్ చీఫ్ సెక్రటరీ రాధా రతౌరి అధికారులకు ఆదేశించారు. ట్రావెల్ ఏజెన్సీలు, డ్రైవర్లు, టూర్ ఆపరేటర్లు, ప్రజలందరికీ ఈ నియమం గురించి తెలియజేయండి అని చెప్పారు.

ఉత్తరాఖండ్ ఒక పర్యాటక రాష్ట్రం. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి స్థానికులు, పర్యాటకులు, తీర్థయాత్ర కోసం వచ్చే భక్తులు.. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని రాధా రతౌరి అన్నారు. గత సంవత్సరం 9 లక్షలకు పైగా భక్తులు ఛార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

Also Read: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Related News

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Big Stories

×