E-Paper
Advertisement

Hyderabad Metro: కోకాపేట్ వరకు మెట్రో.. పెరిగిన రెండో దశ అంచనా వ్యయం

Hyderabad Metro: కోకాపేట్ వరకు మెట్రో.. పెరిగిన రెండో దశ అంచనా వ్యయం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలొ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మునుపటి ప్రాతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలో మీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలో మీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 24, 042 కోట్లకు చేరుకుంది.

హైదరాబాద్ మెట్రో రెండో దశ దూరం, అంచనా వ్యాయాలు పెరిగాయి. రాజదుర్గం నుంచి విప్రో కూడలి , ఫైనాన్షయల్ డిస్ట్రిక్‌లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని మొదట ప్రాతిపాదించారు. దీన్ని కోకాపేట్ నియోపోలీస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కిలో మీటర్లకు పైగా దూరం పెరిగింది. ఈ కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. మెట్రో డిపో కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల క్రిందట పరిశీలించారు.

 

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×