BigTV English

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling| ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ఒక ప్రయాణికుడు తన లగేజ్ తీసుకున్న తరువాత అటుఇటుగా చూపులు చూస్తున్నాడు. అతను కంగారుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక కస్టమ్స్ అధికారి గమనిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ బయటకు వెళ్లే సమయంలో అతడిని పట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏవో మాటలు జరిగాయి. ఆ తరువాత ప్రయాణికుడిని ఆ అధికారి టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన విషయం తెలిసి ఎయిర్ పోర్ట్ అధికారులంతా షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో గల్ఫ్ దేశం నుంచి వచ్చిన ఇండిగో 6E-1346 విమాన ప్రయాణికుడు లగేజ్ తీసుకొని అనుమాస్పదంగా చూపులు చూస్తుండగా.. అతడిని కస్టమ్స్ ఆఫీసర్ వరుణ్ కౌండిన్యా గమనించాడు. ఆ ప్రయాణికుడి ముఖానికి చెమటలు పడుతున్నాయి. ఆఫీసర్ వరుణ్ ఆ ప్రయాణికుడి వద్దకు వెళుతుండగా.. అతను కూడా ఆఫీసర్ రాకను గమనించి ఎయిర్ పోర్టు బయటకు వెళ్లేందుకు త్వరగా నడుస్తున్నాడు. అయినా ఆఫీసర్ వరుణ్ అతడిని గ్రీన్ చానెల్ వద్ద పట్టుకున్నాడు.

ప్రయాణికుడిని పక్కకు తీసుకెళ్లి.. అతని లగేజ్, బట్టలన్నీ చెక్ చేశాడు. కానీ ఏమి కనబడలేదు. అయినా ఆఫీసర్ వరుణ్.. ఆ ప్రయాణికుడిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో భయపడిపోయిన ఆ ప్రయాణికుడు తన వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని అంగీకరించాడు. గల్ఫ్ దేశం నుంచి తీసుకొచ్చిన్నట్లు చెప్పాడు. కానీ ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పలేదు. ఆఫీసర్ వరుణ్ ‌కు అనుమానం కలిగి అతడిని ఎయిర్ పోర్టు టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ ప్రయాణికుడి బట్టలు విప్పి చెక్ చేశాడు. కానీ ఏమీ దొరకలేదు. అయితే ఆ ప్రయాణికుడు తనంట తానే బంగారం ఎక్కడుందో చెప్పాడు.


Also Read: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్

బంగారం తన మలద్వారంలో ఉందని తెలిపాడు. దీంతో ఆఫీసర్ వరుణ్ అతడినే స్వయంగా బయటికి తీసి ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఆ ప్రయాణికుడు తన మలద్వారంలో ఉన్న బంగారాన్నీబయటికి తీశాడు. బంగారాన్ని మొత్తని పేస్టులా చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో మలద్వారంలో దాచాడు. కస్టమ్స్ ఆఫీసర్లు ఆ బంగారాన్ని తూకం వేయగా.. దాని బరువు 967 గ్రాములు ఉందని తేలింది. ఆ బంగారం విలువ దాదాపు 61 లక్షల రూపాయలు ఉంటుంది చెప్పారు. ఆ తరువాత ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

వారం రోజుల క్రితం కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే.. సౌదీ అరేబియా దేశం జెద్దా నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు తన మల ద్వారంలో నాలుగు క్యాప్సూల్ లో 1096.76 గ్రాముల బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. పట్టుబడ్డాడు. ఆ బంగారం విలువ రూ.69 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×