E-Paper
Advertisement

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..
Advertisement

Gold Smuggling| ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ఒక ప్రయాణికుడు తన లగేజ్ తీసుకున్న తరువాత అటుఇటుగా చూపులు చూస్తున్నాడు. అతను కంగారుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక కస్టమ్స్ అధికారి గమనిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ బయటకు వెళ్లే సమయంలో అతడిని పట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏవో మాటలు జరిగాయి. ఆ తరువాత ప్రయాణికుడిని ఆ అధికారి టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన విషయం తెలిసి ఎయిర్ పోర్ట్ అధికారులంతా షాకయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో గల్ఫ్ దేశం నుంచి వచ్చిన ఇండిగో 6E-1346 విమాన ప్రయాణికుడు లగేజ్ తీసుకొని అనుమాస్పదంగా చూపులు చూస్తుండగా.. అతడిని కస్టమ్స్ ఆఫీసర్ వరుణ్ కౌండిన్యా గమనించాడు. ఆ ప్రయాణికుడి ముఖానికి చెమటలు పడుతున్నాయి. ఆఫీసర్ వరుణ్ ఆ ప్రయాణికుడి వద్దకు వెళుతుండగా.. అతను కూడా ఆఫీసర్ రాకను గమనించి ఎయిర్ పోర్టు బయటకు వెళ్లేందుకు త్వరగా నడుస్తున్నాడు. అయినా ఆఫీసర్ వరుణ్ అతడిని గ్రీన్ చానెల్ వద్ద పట్టుకున్నాడు.

Advertisement

ప్రయాణికుడిని పక్కకు తీసుకెళ్లి.. అతని లగేజ్, బట్టలన్నీ చెక్ చేశాడు. కానీ ఏమి కనబడలేదు. అయినా ఆఫీసర్ వరుణ్.. ఆ ప్రయాణికుడిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో భయపడిపోయిన ఆ ప్రయాణికుడు తన వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని అంగీకరించాడు. గల్ఫ్ దేశం నుంచి తీసుకొచ్చిన్నట్లు చెప్పాడు. కానీ ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పలేదు. ఆఫీసర్ వరుణ్ ‌కు అనుమానం కలిగి అతడిని ఎయిర్ పోర్టు టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ ప్రయాణికుడి బట్టలు విప్పి చెక్ చేశాడు. కానీ ఏమీ దొరకలేదు. అయితే ఆ ప్రయాణికుడు తనంట తానే బంగారం ఎక్కడుందో చెప్పాడు.

Also Read: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్

Advertisement

బంగారం తన మలద్వారంలో ఉందని తెలిపాడు. దీంతో ఆఫీసర్ వరుణ్ అతడినే స్వయంగా బయటికి తీసి ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఆ ప్రయాణికుడు తన మలద్వారంలో ఉన్న బంగారాన్నీబయటికి తీశాడు. బంగారాన్ని మొత్తని పేస్టులా చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో మలద్వారంలో దాచాడు. కస్టమ్స్ ఆఫీసర్లు ఆ బంగారాన్ని తూకం వేయగా.. దాని బరువు 967 గ్రాములు ఉందని తేలింది. ఆ బంగారం విలువ దాదాపు 61 లక్షల రూపాయలు ఉంటుంది చెప్పారు. ఆ తరువాత ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

వారం రోజుల క్రితం కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే.. సౌదీ అరేబియా దేశం జెద్దా నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు తన మల ద్వారంలో నాలుగు క్యాప్సూల్ లో 1096.76 గ్రాముల బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. పట్టుబడ్డాడు. ఆ బంగారం విలువ రూ.69 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×