E-Paper
Advertisement

బెంగాల్  అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి!

బెంగాల్  అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి!
Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం సాయంత్రం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 174, క్లాజ్ (2), సబ్-క్లాజ్ (b) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 7, 2026 నుంచే ఈ రద్దు ఉత్తర్వులు అమలులోకి వస్తాయని స్పష్టం చేయడంతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అయితే, ఎన్నికల్లో ఓట్ల లూటీ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయని సంగ‌తి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సువేందు అధికారి పీఏ హత్య వంటి వరుస ఘటనలు శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పట్టాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ యంత్రాంగం సజావుగా సాగే అవకాశం లేదని భావించిన గవర్నర్.. అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్ భవన్ నుంచి వెలువడిన ఈ అధికారిక ప్రెస్ రిలీజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు తప్పిన ప్రమాదం..

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×