E-Paper
Advertisement

CM : సిద్ధూకు పట్టం కడతారా..? డీకేకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..? సీఎం ఎవరు..?

CM : సిద్ధూకు పట్టం కడతారా..? డీకేకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..? సీఎం ఎవరు..?
Advertisement

Karnataka CM Decision Live(Telugu Breaking News): కర్ణాటకలో సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సీఎల్పీ సమావేశంలో క్లా రిటీ రాలేదు. ఎమ్మెల్యేల తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని సిద్ధరామయ్య పట్టుబట్టినా అందుకు డీకే శివకుమార్ అంగీకరించలేదు. ఈ నిర్ణయాన్ని అధిష్ఠానానికి వదిలేయాలని పట్టుబట్టారు.

సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల్లో బలం ఉంది. సిద్ధూనే ముఖ్యమంత్రి కావాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో డీకే అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లానని డీకే అన్నారు. తనకోసం ఏమీ కోరుకోలేదన్నారు. తనకు, సిద్ధూకు మధ్య ఏమాత్రం విభేదాల్లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారనేదాని కంటే ఎవరు కష్టపడ్డారనేదానికి ప్రాధాన్యం ఇవ్వాలని తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. పార్టీ కోసమే తాను శ్రమించానని చెప్పుకొచ్చారు. చాలా కష్టాలు పడ్డానని, సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు.

Advertisement

సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్‌ బయట సిద్ధూ, డీకే మద్దతుదారులు హడావిడి చేశారు. సీఎం నినాదాలతో హోరెత్తించారు. సిద్ధూ, డీకే నివాసాల వద్ద కాబోయే సీఎం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అటు డీకేను సీఎం చేయాలని వొక్కలిగలు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా మరో ప్రతిపాదనను సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారు. సీఎం పదవిని పంచుకుందామని ప్రతిపాదన చేశారు. తాను రెండేళ్లు పదవిలో కొనసాగుతానని .. డీకే శివకుమార్ 3 ఏళ్లు సీఎంగా ఉంటారని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు డీకే అంగీకరించలేదు. అంటే తనకే సీఎం పదవి ఇవ్వాలన్న పట్టుదలతో శివకుమార్ ఉన్నారని స్పష్టమవుతోంది.

Advertisement

ఏడుసార్లు ఎంపీగా చేసిన కె.హెచ్‌.మునియప్ప, మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, లింగాయత్ నేత ఎం.బి.పాటిల్‌ కూడా సీఎం పదవికి పోటీపడుతున్నారు. అయితే వారికి అవకాశాలు లేనట్టే. కర్ణాటక శాసనసభ గడువు ఈ నెల 24తో ముగుస్తుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి సీఎంగా అవకాశం కల్పిస్తుందో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×