BigTV English

Most Popular Chief Minister: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?

Most Popular Chief Minister: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?
Advertisement
national news today india

Most Popular Chief Minister In India: దేశంలోని ముఖ్యమంత్రులపై ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంల జాబితాను విడుదల చేసింది. ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ టాప్ లో నిలిచారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు రెండో స్థానం దక్కింది.


ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కు 52.7 శాతం ప్రజాదరణ ఉందని సర్వేలో తేలింది. నవీన్ పట్నాయక్ 2000 నుంచి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. దాదాపు 24 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు జనంలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే రుజువు చేసింది. రోజురోజుకు ఆయనకు ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది.

సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాపులర్ సీఎంల జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆయనకు 51.3 శాతం ప్రజాదరణ ఉందని సర్వే రిపోర్టు తేల్చింది. యోగి 2017 నుంచి యూపీ సీఎంగా కొనసాగుతున్నారు.


Read More : రైతులతో నేడు నాలుగో దఫా చర్చలు.. డిమాండ్లు నెరవేరుతాయా ?

వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నాయకుడు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉందని సర్వేలో తేలింది. హిమంత బిశ్వశర్మ
48.6 శాతం పాపులారిటీతో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. 2021లో అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ బాధ్యతలు చేపట్టారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాపులర్ సీఎం జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు 42.6 శాతం ప్రజాదరణ లభించింది. 41.4 శాతం ప్రజాదరణతో త్రిపుర సీఎం మాణిక్‌ సాహా ఐదో స్థానంలో నిలిచారు. మాణిక్ సహా 2016లో కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2022లో మాణిక్ సహా త్రిపుర సీఎం పదవి చేపట్టారు.

టాప్ లో ఉన్న ఐదుగురు సీఎంల్లో నవీన్ పట్నాయక్ మినహా మిగిలిన వారంతా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలే కావడం విశేషం.

Tags

Related News

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Big Stories

×