OTT Movie : మర్డర్ మిస్టరీ ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే తెలుగు సినిమా గురించి, ఈ రోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకుందాం. ఈ కథ తెలంగాణ-కర్ణాటక బార్డర్ ఫారెస్ట్ విలేజ్లో 18 సంవత్సరాలుగా జరిగిన అన్సాల్వ్డ్ మర్డర్స్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే తీరు కొత్తగా ఉంటుంది. ఈ సినిమా మిథాలజికల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
భాస్కర్ నారాయణ అనే డిటెక్టివ్, చిన్నప్పుడు తన సోదరుడిని కోల్పోయిన ట్రామా వల్ల క్రైమ్లను సాల్వ్ చేయాలనే ఆబ్సెషన్ కలిగి ఉంటాడు. అతని చూపు సమస్య వల్ల పోలీస్ జాబ్ అవ్వలేక, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అవుతాడు. అతని థిక్ గ్లాసెస్లు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లా కనిపించడంతో అందరూ అతన్ని భూతద్డం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. మరోవైపు చించోలి అనే తెలంగాణ-కర్ణాటక బార్డర్ ఫారెస్ట్ విలేజ్లో, గత 18 సంవత్సరాలుగా 16 హెడ్లెస్ మర్డర్స్ జరిగాయి. ఇవన్నీ అమ్మాయిలవే. ఇవి అన్సాల్వ్డ్గా మిగిలాయి. ఆ ప్రాంతంలో గ్రామస్థులు భయంతో ఉంటారు. ఇది బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్స్తో ముడిపడి ఉందని పుకార్లు వస్తాయి. భాస్కర్ తన అసిస్టెంట్ ప్రసాద్, పోలీస్ ఫ్రెండ్ ఇంద్రజిత్ సహాయంతో ఈ కేసులో ఎంట్రీ ఇస్తాడు. జర్నలిస్ట్ లక్ష్మి కూడా ఈ మిస్టరీలో జాయిన్ అవుతుంది. వాళ్లు కలిసి ఈ హత్యల మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేస్తారు.
భాస్కర్, లక్ష్మి ఈ మర్డర్స్ వెనుక క్రాస్-స్టేట్ కనెక్షన్ ఉందని డిస్కవర్ చేస్తారు. ఇవి సింపుల్ మర్డర్స్ కాదు, హ్యూమన్ సాక్రిఫైస్లు, మిథాలజికల్ రిచ్యువల్స్తో లింక్ అయి ఉంటాయి. భాస్కర్ తన లైఫ్ రిస్క్ చేసుకుని మాస్టర్మైండ్ని పుర్స్యూ చేస్తాడు. ఈ గ్రామంలోని కల్ట్ ఎలిమెంట్స్, బ్లాక్ మ్యాజిక్ సీక్రెట్స్ బయటపడతాయి. లక్ష్మి జర్నలిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ, భాస్కర్ ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్తో కలిసి కథ సస్పెన్స్ఫుల్గా సాగుతుంది. క్లైమాక్స్లో భాస్కర్ ఈ హత్యల మిస్టరీని కనిపెడతాడా ? ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ? అమ్మాయిల తలలను ఎందుకు నరుకుతున్నాడు ? బ్లాక్ మ్యాజిక్ తో వీటికి సంబంధం ఉందా ? అనే విషయాలను ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రం 2024 మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఇందులో శివ కందుకూరి (భాస్కర్ నారాయణ), రాశి సింగ్ (లక్ష్మి), అరుణ్ కుమార్ (వాట్సన్ ప్రసాద్), దేవి ప్రసాద్ (సీఐ దానవ శంకరాచార్యులు), వర్షిణి సౌందరరాజన్ (రుద్రావేని) ముఖ్య పాత్రల్లో నటించారు. 2024 మార్చి 22 నుండి Aha, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : అర్ధరాత్రి అరుపులు… లేని పెళ్ళాం మిస్సింగ్ అంటూ కేసు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్