Comedy drama OTT : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాత్రం మరో లెవెల్ లో ఉంటుంది. ముంబైలో ఉండే నలుగురు మహిళల చుట్టూ ఈ కథ ఉంటుంది. ప్రత్యేకించి ఈ సిరీస్ ను మహిళలు చూడడం బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో మహిళలు కష్టాలను ఎలా తట్టుకోవచ్చో, ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మొగుడు, పిల్లలు, సంప్రదాయం అని కాకుండా.. మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం అన్నట్టుగా పక్కా లోకల్ అండ్ బోల్డ్ స్టైల్లో ఈ సిరీస్ సాగుతుంది.
ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ (Four More Shots Please!). ఇందులో సాయనీ గుప్తా, కీర్తి కుల్హారీ, బానీ జె మరియు మాన్వీ గగ్రూ లీడ్ రోల్స్ లో నటించారు. మొదటి సీజన్ 2019 జనవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. విడుదలైంది. మొత్తం 4 సీజన్లతో చివరి సీజన్ డిసెంబర్ 2025లో విడుదలైంది.
ముంబై సిటీలో నలుగురు బిందాస్ ఆడోళ్లు ఉంటారు. ఒకరు జర్నలిస్ట్ అయితే, ఇంకొకరు మొగుడితో విడిపోయిన లాయర్, మరొకరు జిమ్ ట్రైనర్, ఇంకొకరు పెళ్ళి కావట్లేదని బాధపడే రిచ్ పిల్ల. వీళ్ళందరికీ లోకం ఏమనుకున్నా పట్టింపు లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మస్తుగా తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ట్రక్ బార్ లో కలుస్తుంటారు. వీళ్ళ లైఫ్ అంతా రచ్చ రచ్చే. ఈ నలుగురి లైఫ్లో ప్రేమాయణాలు, బ్రేకప్లు మామూలే. ఒకరు పెళ్ళైన వాడితో లవ్ అంటారు, ఇంకొకరు అమ్మాయిలతోనే డేటింగ్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చేసే పెళ్ళి గోల, ఆఫీసులో బాసుల టార్చర్లు తట్టుకోలేక పిచ్చెక్కిపోతుంటారు. కానీ ఎంత గొడవలు అయినా, ఎవరితో బ్రేకప్ అయినా.. చివరకు ఈ నలుగురు దోస్తులు మాత్రం ఒకరికొకరు తోడుగా నిలబడుతుంటారు.
Read Also : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్