Romantic Movie OTT : టాలీవుడ్ లో ఒకప్పుడు అడపా గడప సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ చిత్రం ఆమె లైఫ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే జోనర్ లాగా రావడంతో ఆమెకు పెద్దగా హిట్ సినిమాలు పడలేదు.. ఈమధ్య కొత్త కథలతో సినిమాల చేస్తుంది అయినా కూడా ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందించలేదు. ఇటీవల ఓ రొమాంటిక్ మూవీలో నటించింది. ఆ మూవీ థియేటర్లలో కి విడుదలైన మూడు నెలలకు ఓటీటీ లోకి రాబోతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ…
హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం ఓటీటీ లోకి వచ్చింది.. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో ఓటిటి అప్డేట్ ను ప్రకటించారు అయితే రిలీజ్ అయిన మూడు నెలల వరకు కూడా ఓటిటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవ్వదు అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు సడన్ గా ప్రముఖ ఓటిటి సంస్థలో స్ట్రీమింగ్ వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.. నేడు ఈ మూవీ ఓటీటీలో కి వచ్చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ ను అందుకుందని వార్తలు వినిపిస్తుంది.
స్టోరీ విషయానికొస్తే..
ధూం ధాం మూవీలో చేతన్ కృష్ణ హీరోగా నటించాడు. వెన్నెల కిషోర్, సాయి కుమార్, గోపరాజు రమణతో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. గోపిమోహన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించాడు.. రామ రాజుకు కొడుకు కార్తీక్ అంటే ప్రాణం. కొడుకు సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. కార్తీక్ కూడా తండ్రే లోకంగా బతుకుంటాడు.. హీరోయిన్ హీరో మధ్య గొడవల తో మొదలైన పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేస్తుంది. ఇద్దరూ దగ్గరవుతారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్లోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే నిజం బయట పడుతుంది. ఆ గొడవలకు కారణం ఏమిటి? సుహానా ఫ్యామిలీకి రామరాజు, కార్తీక్ ఎలాంటి ద్రోహం తలపెట్టారు? సుహానా ప్రేమను గెల్చుకున్నాడా లేదా ఇద్దరు విడిపోయారు అన్నది ఈ మూవీ స్టోరీ.. ఈ మూవీ లో హెబ్బా పటేల్ గ్లామర్ రోల్లో కనిపిస్తుంది. టైటిల్ తగ్గట్టుగానే ఈ మూవీ మొత్తం రొమాంటిక్ సన్నివేశాల తో నిండి ఉంటుంది. కథ పర్వాలేదు అనిపించినా కాస్త డైరెక్టర్ తడబడినట్టు తెలుస్తుంది. దాంతో ఈ సినిమా కొద్దిరోజులకి థియేటర్ల నుంచి బయటకు వచ్చేసింది. థియేటర్లలో ఆకట్టుకొని ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..