E-Paper
Advertisement

Kaantha OTT: అప్పుడే ఓటీటీకి ‘కాంత’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Kaantha OTT: అప్పుడే ఓటీటీకి ‘కాంత’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!
Advertisement

Kaantha OTT Release: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రంకాంత‘. టాలీవుడ్భళ్లాలదేవ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించాడు. పీయారిడికల్మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య తమిళ్‌, తెలుగు, మలయాళంలో విడుదలైన చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. 1950 కాలం నాటి మద్రాస్‌లో ప్రముఖ నటుడు, అతని దర్శకుడు మధ్య జరిగే ఇగో క్లాష్‌ నేపథ్యంలో సాగిన చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

రిలీజ్ కి ముందే ఓటీటీ డీల్

Advertisement

వరుస సక్సెస్తో దూసుపోతున్న దుల్కర్కి సినిమా బ్రేక్వేసిందికనీసం రిటర్న్స్కూడా రాబట్టేకపోయింది కాంత. థియేటర్లలో నిరాశ పరిచిన సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. దుల్కర్పై ఉన్న నమ్మకం, ఆయన సక్సెస్రేట్పై ఉన్న ధీమాతో థియేట్రికల్రిలీజ్కి ముందే కాంత ఓటీటీ డీల్ జరిగింది. సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందేథియేట్రికల్రన్పూర్తి చేసుకున్న చిత్రం డిసెంబర్లో ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తుంది.

అప్పుడే స్ట్రీమింగ్..

ఓటీటీ ఒప్పందం ప్రకారం మూవీని నెల రోజుల్లోనే డిజిటల్ప్రీమియర్కు ఇవ్వబోతుంది. నేపథ్యంలో డిసెంబర్‌ 12 కాంత నెట్ఫ్లిక్స్విడుదల కానుంది. అయితే దీనిపిఐ ఆఫీషియల్అనౌన్స్మెంట్లేదు. కానీ, డిసెంబర్‌ 12 కాంత ఓటీటీకి రాబోతుందని సోషల్మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది. ఇదే డేట్ని ఫిక్స్చేస్తూ నెట్ఫ్లిక్స్కూడా త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి డిసెంబర్‌ 12 కాంత ఓటీటీకి వస్తుందా? రాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సెల్వమని సెల్వరాజ్దర్శకత్వంలోతమిళంలో రూపొందిన చిత్రం తెలుగులోనూ విడుదలైంది. దీనికి దుల్కర్సల్మాన్‌, రానా దగ్గుబాటి, ప్రశాంత్పోట్లూరితో నిర్మాతలుగా వ్యవహరించారు. రామా నాయుడు స్టూడియో భాగస్వామ్య సంస్థలో ఒకటైన స్పిరిట్ మీడియా ద్వారా కాంతను తెలుగులో సమర్పించారు.

Advertisement

Also Read: Samantha-Raj Nidimoru Assets: రాజ్నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!

వివాదం ఏమిటంటే

అయితే సినిమాను తమిళ సినీ దిగ్గజం ఎంకె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కినట్టుగా కోలీవుడ్లో ప్రచారం ఉంది. కానీ, ఇది పూర్తి కల్పిత కథ అని మూవీ టీం మొదటి నుంచి చెప్పుకొస్తుంది. కానీ, సినిమా కథ, ఎంకె త్యాగరాజ భాగవతార్ చాలా దగ్గర ఉండటంతో ఆయన మనవడు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో మా తాత గారిని తప్పుగా చూపించారని, ఎం.కె. త్యాగరాజన్ మనవడు కోర్టు మెట్లు ఎక్కాడు. తన తాత అప్పుల్లో చనిపోయినట్లు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ కథలో ఒక నటుడికి, తనను పరిచయం చేసిన దర్శకుడితో వివాదం మొదలవుతుంది. హీరో తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చానని చెప్పడంతో దర్శకుడి ఇగో హార్ట్ అవుతుంది. దర్శకుడు మాత్రం నేను డైరెక్ట్ చేయడం వల్లే నీకు ఇంత పేరు వచ్చిందని వాదనలు జరుగుతాయి. మధ్యలోవచ్చే మరిన్ని పాత్రలు కథకి మరింత బలాన్ని ఇచ్చాయి.

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×