OTT Movie : హారర్ థ్రిల్లర్ జానర్ లో గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ‘L’ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. కేరళలోని వివిధ ప్రాంతాలలో మహిళల అనుమానాస్పద మరణాల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ స్టోరీ ఇన్వెస్టిగేషన్ లో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏడాది తరువాత ఇప్పుడు థ్రిల్లర్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
షోజి సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ‘L’ చిత్రం గత సంవత్సరం థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం 2025 నవంబర్ 27 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విష్ణు, అమృత మీనన్, బిగ్ బాస్ ఫేమ్ సంధ్యా మనోజ్, జోషి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. షెల్లీ జాయ్ ఎల్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే రాశారు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉండనుంది.
కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లు ఒక్కొక్కరుగా మిస్టీరియస్గా చనిపోతుంటారు. ఆధారాలు మాత్రం ఏమీ దొరకడం లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్ని మరణాలూ 1980ల్లో హంగరీలో జరిగిన ఒక సీరియల్ కిల్లింగ్స్తో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంటాయి. సీబీఐ ఆఫీసర్ విష్ణు (విష్ణు ఉన్నికృష్ణన్) కేసు తీసుకుని, IG రేణుక (అమృతా మెనన్)తో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. స్టోరీ నడుస్తున్న కొద్ది మరింత భయంకరమైన ట్విస్ట్ వస్తుంది.
Read Also : ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?