Action Movie OTT : తెలుగు సినిమాలతో పాటుగా మలయాళం సినిమాలు కూడా ఆసక్తిగా ఉంటున్నాయి. అందులో హారర్, యాక్షన్ మూవీలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య సస్పెన్స్ సినిమాలకు కేరాఫ్ మలయాళం అనే విధంగా సరికొత్త కథలతో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పలకరించాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటిలో కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే సీన్లతో కలిగిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటిలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం..
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ “పణి” ఓటీటీలోకి వస్తోంది. జోజూ జార్జ్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన పణి మూవీ ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా భారీగా కలెక్షన్స్ ను కూడా రాబాట్టింది. ఆ సినిమాను ఓటీటిలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను ‘సోనీ లివ్’ సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 20న ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తుంది.
ఈ ఏడాది అక్టోబర్ 24 న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇక పణి మూవీతోనే జోజూ జార్జ్ డైరెక్టర్గా మలయాళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అభినయ హీరోయిన్గా నటించింది. బిగ్బాస్ మలయాళం సీజన్ 5 కంటెస్టెంట్స్ అయిన సాగర్ సూర్య, జునైజ్ విలన్ పాత్రల్లో కనిపించారు. పణి మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచెయ్యడం విశేషం.. ఈ మూవీ కేవలం 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఇరవై ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. గిరి అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. భార్య గౌరితో కలిసి సంతోషంగా అతడి జీవితం సాగిపోతుంటుంది. గిరి స్నేహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురవుతాడు. డాన్, శిజీ అనే యువకులు గిరి స్నేహితుడిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడుతుంది. గిరిని డాన్, శిజీ టార్గెట్ చేస్తారు.. అతన్ని ఎందుకు హత్య చేశారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ మర్డర్ మిస్టరి చుట్టూ కథ తిరుగుతుంది.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటిలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాల చేస్తోన్నాడు జోజు జార్జ్. కమల్ హాసన్, మణిరత్నం థగ్లైఫ్తో పాటు సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.