OTT Platforms : కరోనా ముందు వరకు ఏ సినిమా రిలీజ్ అయినా అది థియేటర్లలో రిలీజ్ అయ్యేది.. కరోనా సమయంలో థియేటర్లు బంద్ కావడంతో ఓటీటీ సంస్థలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను సందడి చేసేది. కానీ తర్వాత టోటల్ గా మారిపోయింది. థియేటర్లు తెరుచుకున్న తరువాత అక్కడ రిలీజ్ అయిన నెల లోపే ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి.. థియేటర్లలో సక్సెస్ అయిన అవ్వకపోయినా ఇక్కడికి వచ్చే సినిమాలు మంచి వ్యూస్ ని రాబడుతూ సక్సెస్ టాక్ని అందుకుంటున్నాయి.. దాంతో కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలని ఇక్కడే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య వీటికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎక్కువమంది థియేటర్లలో సక్సెస్ అవ్వకపోయినా కూడా ఇక్కడ మంచి టాక్ ని సొంతం చేసుకొని సక్సెస్ అవ్వచ్చు అని అభిప్రాయాలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ విధానం తప్పు అని ఓ నిర్మాత సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అలా అనడానికి కూడా కారణం ఉంది ఇంతకీ ఆయన ఎందుకన్నాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ఓటీటీ సంస్థలు..
ప్రతినెలా థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. ఇక్కడ కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడంతో ఎక్కువమంది ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అందుకే వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది.. తాజాగా దీన్ని ఓ నిర్మాత తప్పు పట్టారు. ఓ ఇంటర్వ్యూ నిర్మాత మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పు కొచ్చారు.
Also Read: బిగ్ బాస్ వల్ల నా కెరీర్ పోయింది.. కావాలనే అలా క్రియేట్ చేశారు..
ఓటీటీ సంస్థల పై నిర్మాత కామెంట్స్..
ఈ మధ్యకాలంలో సినిమాలపై ఒకటి సంస్థల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది.. కొత్త, పాత సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ నమ్ముకొని సినిమా చేస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపుకోవడమే అనే పరిస్థితి వచ్చేసింది.అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాని నిర్మించిన సునీల్, అశోక్ ఇదే అంశాన్ని సూటిగా చెప్పుకొచ్చారు. వాళ్లు మాట్లాడుతూ.. మనం తీసే కంటెంట్ పై నమ్మకం ఉండాలి. కానీ ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకుంటే ఇక మనమీద నమ్మకం పోతుంది. సినిమా అల్టిమేట్ బిజినెస్ థియేటరే కావాలి. ఓటీటీల శకం ముగిసింది.. దాన్ని నమ్ముకొని సినిమా చేయడం ఆపేయాలి. సినిమా అనేది కేవలం థియేటర్ ఆధారంగా నిర్మించాలి.. ప్రస్తుతం ఓటీటీ సంస్థల పని అయిపొయింది. వీటికి ముగింపు పలికినట్లే అని అన్నారు. ఆ సంస్థలు పెట్టే నియమాలకు లోబడి సినిమాలు రిలీజ్ చేయడం కంటే ఆ ఆప్షన్ ని తీసేయడమే మేలు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..