Psychological thriller OTT : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో థ్రిల్లర్ సిరీస్ లను తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఒక బెంగాలీ వెబ్ సిరీస్. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి, ఎదురయ్యే భయంకరమైన సంఘటనలు చుట్టూ ఈ స్టోరీ జరుగుతుంది. ఏడు ఎపిసోడ్ లు ఉన్న ఈ సిరీస్ ను చూస్తే, అస్సలు చూపు తిప్పుకోలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ని చూస్తే క్రేజీగా ఫీల్ అవుతారు.
అబ్రజిత్ సేన్ దర్శకత్వం వహించిన ఈ బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘రోంకిణి భవన్’ (Ronkini Bhavan). ఇందులో శ్యామౌప్తి మడ్లీ, గౌరబ్ రాయ్ చౌదరి, బిదీప్తా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ZEE5 ఓటిటి ప్లాట్ ఫామ్లో 2025 డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 7.6 రేటింగ్ పొందింది.
1990ల కాలంలో జూతిక అనే ఒక పల్లెటూరి అమ్మాయికి, పురూలియాలోని పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన ఆదిత్యనాథ్తో పెళ్లవుతుంది. పెద్ద ఇల్లు, బోలెడంత ఆస్తి అని మురిసిపోతూ అత్తగారింట్లో అడుగుపెడుతుంది. కానీ అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచే ఆమెకు అన్నీ వింత వింతగా కనిపిస్తుంటాయి. ఆ ఇంట్లో అంతకుముందు పెళ్లయి వచ్చిన కోడళ్లందరూ అనుమానాస్పదంగా చనిపోయారని తెలిసి జూతికకు అసలు భయం మొదలవుతుంది. అయితే ఆ చనిపోయిన కోడళ్లంతా ‘రోంకిణి దేవి’ శాపం వల్లనే చనిపోయారని, ఆ దేవికి కోపం వస్తే ఆ ఇంటి ఆడబిడ్డలు దక్కరని ఆ కుటుంబ సభ్యులంతా గుడ్డిగా నమ్ముతుంటారు.
కానీ జూతికకు మాత్రం ఇది దేవుడి శాపం కాదని, ఈ చావుల వెనుక ఎవరో మనుషుల కుట్ర ఉందనే అనుమానం గట్టిగా వస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో జరిగే రహస్య పూజలు ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరికి జూతిక ధైర్యం చేసి అసలు నిజం ఏంటో వెతకడం మొదలుపెడుతుంది. ఆ జమీందారీ ఇంటి వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు, ఒక్కొక్కటిగా బయటపడతాయి. అది దేవుడి శాపమా ? లేక మనుషులు ఆడుతున్న నాటకమా ? అనేది మాత్రం క్లైమాక్స్లో చాలా థ్రిల్లింగ్గా చూపిస్తారు.
Read Also : రక్తం తాగే జోంబీలు… ఊరంతా ఉక్కిరిబిక్కిరి… క్రాక్ ఎక్కించే క్లైమాక్స్