Silent Screems: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిత్యం ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి. కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యదార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. తాజాగా ఇదే నేపథ్యంలో మరో సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. తెలంగాణ లోని వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ త్రిల్లర్ ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గత కొంతకాలంగా మహిళల పట్ల పెద్ద ఎత్తున జరుగుతున్న నేరాలు కేవలం సంఖ్యలగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పడం కోసం ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘(Silent Screems)అనే కథతో ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్(Sun Nxt) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఒక కుటుంబం పై సమాజంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయునున్నారు. ఇలాంటి ఒక క్రైమ్ డాక్యుమెంటరీ కి ప్రముఖ నటి శృతిహాసన్ (Shruthi Hassan)వాయిస్ ఓవర్ తో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మహిళలపై జరుగుతున్న నేరాలు నెంబర్లకు మాత్రమే పరిమితం కాకుండా న్యాయం కోసం చేసే పోరాటాన్ని, బాధితుల మౌనం వెనుక ఉన్న బాధను కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసమే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్ సన్ నెక్స్ట్ లో ప్రసారంలో అందుబాటులోకి వచ్చింది.ఈ సిరీస్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నమని చెప్పాలి.
క్రైమ్ డాక్యుమెంటరీ..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇప్పటికే సన్ నెక్స్ట్ లో జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మకమైన సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఇలాంటి వినోదాత్మక కంటెంట్ తో పాటు ఆలోచన కలిగించే ఈ క్రైమ్ డాక్యుమెంటరీని సన్ నెక్స్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. క్రైమ్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారు ఆలస్యం చేయకుండా సన్ నెక్స్ట్ లో సైలెంట్ స్క్రీమ్స్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. 4,000+ టైటిల్స్, 44+ లైవ్ ఛానళ్లతో, సన్ నెక్స్ట్ అన్ని వయసుల ప్రేక్షకులకు ఒకే వేదికగా నిలుస్తోంది.
Also Read: BMW Pre Release: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..