E-Paper
Advertisement

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు

Pawan Kalyan: వివాదంలో పవన్ కల్యాణ్.. బూట్లు విప్పకుండా అలా చేయడంతో విమర్శలు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో వివాదం చిక్కుకున్నారు. పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ చేసిన ఓ పని రాజకీయ దుమారం రేపుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ పరిశీలిస్తున్న సమయంలో.. ఒకరు దేవుని ప్రతిమ అందించారు. ఈ ప్రతిమ స్వీకరించే సమయంలో పవన్ కల్యాణ్ షూ విప్పలేదు. పక్కనున్న వాళ్లు దీనిని వీడియోలు తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారని కామెంట్స్ చేస్తు్న్నారు.

వైసీపీ విమర్శలు

ఈ వీడియోను వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. పవన్ కల్యాణ్ కపట భక్తికి నిదర్శనమని విమర్శలు గుప్పించింది. ‘‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అపచార పనులు’’ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఆచరణలో మాత్రం దైవ గౌరవాన్ని విస్మరించారని ఆరోపించింది. పవన్ కల్యాణ్, జగన్ వీడియోలు పక్కపక్కనే పెట్టి వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో జగన్ చెప్పులు విప్పి దేవుని ప్రతిమ తీసుకోగా.. పవన్ షూతో దేవుని ప్రతిమ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

Also Read: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ 

పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఈ సంక్రాంతి నుంచి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనే మాటలు పోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు” అన్నారు.

రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు

“గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×