Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో వివాదం చిక్కుకున్నారు. పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ చేసిన ఓ పని రాజకీయ దుమారం రేపుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ పరిశీలిస్తున్న సమయంలో.. ఒకరు దేవుని ప్రతిమ అందించారు. ఈ ప్రతిమ స్వీకరించే సమయంలో పవన్ కల్యాణ్ షూ విప్పలేదు. పక్కనున్న వాళ్లు దీనిని వీడియోలు తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారని కామెంట్స్ చేస్తు్న్నారు.
కొత్త వివాదంలో పవన్ కల్యాణ్.. వీడియో వైరల్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. దేవుని ప్రతిమను స్వీకరించే సమయంలో పవన్ కనీసం షూ కూడా విప్పలేదని, ఇది ఆయన కపట భక్తికి నిదర్శనమని వైసీపీ ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు గుప్పించింది. ‘‘చెప్పేవి శ్రీరంగ… pic.twitter.com/5vynqCvs8y
— ChotaNews App (@ChotaNewsApp) January 9, 2026
ఈ వీడియోను వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. పవన్ కల్యాణ్ కపట భక్తికి నిదర్శనమని విమర్శలు గుప్పించింది. ‘‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అపచార పనులు’’ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఆచరణలో మాత్రం దైవ గౌరవాన్ని విస్మరించారని ఆరోపించింది. పవన్ కల్యాణ్, జగన్ వీడియోలు పక్కపక్కనే పెట్టి వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో జగన్ చెప్పులు విప్పి దేవుని ప్రతిమ తీసుకోగా.. పవన్ షూతో దేవుని ప్రతిమ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.
Also Read: నేను నెం 1 కాదు… టాలీవుడ్లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్
ఈ సంక్రాంతి నుంచి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనే మాటలు పోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు” అన్నారు.
“గత 18 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత ఏడాది దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే… ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఇంత ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తాను. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్