Sirai OTT release date : ఓటీటీలోకి మరో తమిళ చిత్రం ఎంట్రీ ఇవ్వబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్ట్రూమ్ క్రైమ్ మూవీ థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ తో నడిచింది. ఇది విక్రమ్ ప్రభు కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కింది. సుమారు ₹3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ₹30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించింది. పోలీస్ ప్రొసీజరల్ డ్రామా అయిన ఈ సినిమా, ఒక హత్య కేసులో నిందితున్ని కోర్టుకు హాజరుపరచాల్సిన ఒక ఎస్కార్ట్ పోలీసు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే వివరాల్లోకి వెళ్తే …
విక్రమ్ ప్రభు నటించిన ఈ తమిళ క్రైమ్ డ్రామా మూవీపేరు ‘సిరై’ (Sirai). ఈ చిత్రానికి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 ఓటీటీ ప్లాట్ ఫామ్ పొందింది. జనవరి 23న నుంచి ఈ సినిమా ప్రీమియర్ అవుతుందని ఆ సంస్థ అధికారికంగా కూడా ప్రకటించింది. 2025 డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ, ‘తానక్కారన్’ సినిమాను నిర్మించిన దర్శకుడు తమిజ్ కథ ఆధారంగా రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్కుమార్, అనంత తంబిరాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులు నుండి కూడా ప్రశంసలు అందుకుంది.
Read Also : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ‘కదిరవన్’ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్రను పోషించారు. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని జైలు నుండి శివగంగ కోర్టుకు తరలించే క్రమంలో జరిగే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. హత్య కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న అబ్దుల్ నేపథ్యంలో ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు ఈ అబ్దుల్ ఎవరు ? ఆ హత్య కేసు ఏమిటి ? కదిరవన్ పాత్ర ఇందులో ఎలాంటి మలుపులు తెస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ క్రైమ్ డ్రామా సినిమాను మిస్ కాకుండా చూడండి.